NTR: అన్న కళ్యాణ్రామ్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ భారీ త్యాగం.. కొరటాల, ప్రశాంత్నీల్ చిత్రాలతో క్లారిటీ ?
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలు ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు. తమ సినిమాల్లో భాగమవుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో పెద్ద త్యాగం చేశాడు. అభిమానులచే ప్రశంసలందుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తి. కుటుంబ సభ్యులకోసం ఏమైనా చేస్తాడనే టాలీవుడ్లో వినిపించే మాట. దాన్ని ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఆర్థికంగా కాస్త డౌన్ అయిన అన్నని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. నిర్మాతగా పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్టీఆర్. అందుకోసం ఆయన చేస్తున్న త్యాగం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు.
ఎన్టీఆర్.. త్వరలో నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆయన తండ్రి హరికృష్ణ పేరుతో ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడని, తన సినిమాలను అందులోనే నిర్మించాలని, ఇతర బ్యానర్ల పార్టనర్ షిప్లో సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏంటో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అదే సమయంలో అన్న కళ్యాణ్ రామ్ని నిర్మాతగానూ నిలబెట్టాలనుకుని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అయితే ఈ విషయాన్ని తాజాగా కన్పమ్ చేశారు ఎన్టీఆర్. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఆయన రెండు పాన్ ఇండియా సినిమాలను ప్రకటించారు. కొరటాల శివతో చేయబోయే `ఎన్టీఆర్ 30`, ప్రశాంత్ నీల్తో చేయబోతున్నట్టు `ఎన్టీఆర్ 31` సినిమాలను అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్లని విడుదల చేశారు. ఈ పోస్టర్లు గూస్బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ట్రీట్లా ఉన్నాయని చెప్పొచ్చు.
ఈ రెండు సినిమాలకు నిర్మాతగా హీరో కళ్యాణ్ రామ్ ఉండటం విశేషం. అన్న కళ్యాణ్ రామ్ని తన సినిమాల్లో భాగస్వామ్యం చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది. కళ్యాణ్ రామ్ నిర్మించిన చాలా సినిమాలు ఇటీవల పరాజయం చెందాయి. దీంతో ఆయన బాగా నష్టపోయినట్టు వార్తలొచ్చాయి. అన్నయ్యని నిర్మాతగా నిలబెట్టేందుకు ఎన్టీఆర్.. తన ప్రొడక్షన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు చర్చ నడుస్తుంది.
అంతేకాదు ప్రస్తుతం ప్రకటించిన రెండు సినిమాలకుగానూ ఎన్టీఆర్ పారితోషికం తీసుకోవడం లేదట. వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సినిమా హిట్ అయితే లాభాలు వచ్చి ఎన్టీఆర్కి షేర్ వస్తుంది, లేదంటే పారితోషికం త్యాగం చేయనున్నారు తారక్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ఇకపై తాను నటించే అన్ని సినిమాల్లో అన్న కళ్యాణ్ రామ్కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నారట. అన్న బ్యానర్నే సొంత బ్యానర్గా భావించి సినిమాలు చేయాలనుకుంటున్నట్టు టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన ఇతర బ్యానర్లలో `బింబీసార`, `డెవిల్`తోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు. హీరోగానూ ఫెయిల్యూర్లో ఉన్న ఆయన ఈ సారి కచ్చితంగా హిట్లు కొట్టాలని తపిస్తున్నారు. మరి సక్సెస్ కొట్టి మళ్లీ హీరోగా పుంజుకుంటారా? చూడాలి.