రాజమౌళికి ఎన్టీఆర్ డెడ్ లైన్ ? అప్పటిలోగా ఫినిష్!
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసారు కానీ ..అది సాధ్యమయ్యే పనికాదు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఏ ఆగస్ట్ కో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయితే వేరే ప్రాజెక్టులోకి వెళ్దామని హీరోలిద్దరూ చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ లేటుకు చాలా అసహనంగా ఉన్నారట.
దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ లేకుండా గడిచిపోయింది. ఈ నేపధ్యంలో రాజమౌళి తో మాట్లాడిన ఆయన తన పార్ట్ ..జనవరికు పూర్తి చేసేయమని అడిగారట. అప్పుడు పిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు వెళ్దామని ఆయన ఆలోచనగా చెప్తున్నారు.
ఈ మేరకు రాజమౌళికి డెడ్ లైన్ పెట్టారని మీడియాలో వినపడుతోంది. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. ఇక రాజమౌళి ఒప్పుకున్నారా..లేదా అనేది ప్రక్కన పెడితే...రామ్ చరణ్ తో ఉన్న కాంబినేషన్ సీన్స్ ని ప్లాన్ చేస్తారని వినపడుతోంది.
ఈ నేపధ్యంలో రాజమౌళి ఈ సారి షూట్ కు అనువైన, ఏ విధమైన ఇబ్బందులు రానటువంటి ప్లానింగ్ చేయబోతున్నట్లు సమచారం. అందుకోసం ఓ కొత్త ఐడియా ఆలోచించినట్లు సమాచారం.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ..తాజా చిత్రం బెల్ బాటమ్ షూటింగ్ ...కరోనా ప్రభావం లేని యూరప్ దేశాల్లో నిశ్చింతగా మొదలైంది. వారు ధైర్యంగా అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు.
అదే విధంగా తాము కూడా అటువంటి దేశం ఎంచుకుని అక్కడ క్రూని సమకూర్చుకుని షూటింగ్ లో చాలా భాగం ఫినిష్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధ్యా సాధ్యాలను రాజమౌళి టీమ్ పరిశీలిస్తోందని వినికిడి. కరోనా కేసులు లేని దేశంలో లొకేషన్ ఎంపిక చేసి, ఫర్మిషన్స్ తీసుకోవటం పై ప్రస్తుతం నిర్మాత దానయ్య టీమ్ ముందుకు వెళ్తోంది.
ఈ చిత్రంలో రోమాంచితంగా సాగే ట్రైన్ ఎపిసోడ్ ఒకటి వుందని, దీన్ని రామ్చరణ్, ఎన్టీఆర్లపై దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలిసింది. లాక్ డౌన్ ముందు వరకు దాదాపు 500 మంది క్రూతో షూటింగ్ జరిగింది.
ఈ ఎపిసోడ్ ని 30 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారని, ఇందు కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో ట్రైన్ సెట్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్ సినిమాలో 3 నిమిషాల పాటు రోమాంచితంగా సాగనుందని, ఇదే `ఆర్ ఆర్ ఆర్`కు మేజర్ హైలైట్గా నిలవనుందని తెలిసింది.
ఇక సినిమా మొత్తంలో పలు గెటప్స్లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా చరణ్, బందిపోటు గెటప్లో ఎన్టీఆర్ కనిపిస్తారట.
మరికొన్ని గెటప్స్లోనూ ఎన్టీఆర్, చరణ్లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్ గెటప్స్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, చరణ్కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది చిత్ర టీమ్. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అంతే కాకుండా 10 ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. డీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాఫిక్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్బుతంగా రావాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు.
బెస్ట్ అవుట్పుట్ కోసం పరితపించే రాజమౌళి.. సినిమా విడుదలలో ఎంత జాప్యమైనా పట్టించుకోరనే విషయం గతంలో ఎన్నోసార్లు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఆయన అదే పంథాను అనుసరించారు.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రామరాజుగా చరణ్ ని చాలా కొత్తగా రాజమౌళి ప్రెజెంట్ చేశారు. చరణ్ కండల శరీరంతో అలరించగా, అద్భుత విజువల్స్ తో ఆ టీజర్ దుమ్మురేపింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
‘‘ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాలని మా టీమ్ అంతా కష్టపడుతోంది. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే. అయితే మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’’అంటూ నిర్మాత ప్రకటించారు.
అయితే కరోనా దెబ్బకు షూటింగ్లు వాయిదాపడటం సహా, జక్కన్న, కుటుంబానికి మహమ్మారి సోకిన నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సగటు సినీ అభిమానులు భావిస్తున్నారు.