ఇప్పుడు అల్లు అర్హ, అప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి, రోజా రమణి.. పౌరాణిక పాత్రలతో బాలనటులుగా ఎంట్రీ
ఇప్పుడు బన్నీ తన అల్లు అర్హ, అప్పుడు ఎన్టీఆర్, అతిలోక సుందరి శ్రీదేవి, సీనియర్ నటి రోజా రమణి తమ కెరీర్ని బాలనటులుగా ప్రారంభించారు. అంతేకాదు వీరంతా పౌరాణిక పాత్రలతోనే బాలనటులుగా కెరీర్ని స్టార్ట్ చేయడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. `ప్రిన్స్ భరత`గా అంటే బాల నటుడి(మేల్)గా కనిపించబోతుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పౌరాణిక చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించారు. ఆయన తాతగారు ఎన్టీఆర్ రూపొందించిన నటించిన `బ్రహ్మార్షి విశ్వమిత్ర` చిత్రంలో బాలనటుడిగా భరతగా నటించారు. ఆడియెన్స్ ని తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత `బాలరామాయణం`లో రాముడిగా నటించి ఫిదా చేశారు. బ్యాక్ టూ బ్యాక్ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో, అది కూడా బాల నటుడిగా నటించి పాపులర్ కావడం విశేషం.
ఇక అతిలోక సుందరి హిందీతోపాటు సౌత్ ఇండస్ట్రీలను మొత్తం ఓ ఊపు ఊపిన శ్రీదేవి కూడా తన కెరీర్ని బాల నటిగానే ప్రారంభించింది. ఆమె తమిళంలో శివాజీ గణేషన్ నటించిన `కాంధన్ కరునై` చిత్రంలో లార్డ్ మురుగన్(మేల్) పాత్రలో నటించింది. అంతేకాదు తెలుగులో `యశోద కృష్ణ` చిత్రంలో బాలనటుడిగా బాల కృష్ణ పాత్రలో మెస్మరైజ్ చేసింది.
సీనియర్ నటి రోజా రమణి సైతం తన తొలి చిత్రం `భక్త ప్రహ్లాద`లో ఆమె ప్రహ్లాద(మేల్) పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
మేల్గా ఆమె పాత్రలో ఒదిగిపోయిన తీరు అందరిని కట్టిపడేసింది. ఎస్వీరంగారావు, అంజలి, జయంతి ప్రధాన పాత్రలు పోషించారు.