గాంధీ జయంతిని టార్గెట్ చేసిన అనుష్క
అనుష్క రీఎంట్రీ ఇస్తున్న `నిశ్శబ్దం` చిత్రం విడుదలకు మార్గం సుగుమమైంది. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. గ్లోబర్ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
హ్రరర్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కతోపాటు ఆర్. మాధవన్, అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.
మాటలు రాని, వినికిడి లోపం ఉన్న ఆర్టిస్ట్, సెలబ్రిటీ మ్యూజీషియన్ అయిన ఆమె భర్త, ఆమె బెస్ట్ ఫ్రెండ్ వింత అదృశ్యం అంశంపై ఈ సినిమా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. అనుష్క మాట్లాడుతూ, తాను ఇప్పటి వరకు పోషించని ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపింది. `నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు నెట్టివేసేసిన పాత్ర ఇది. ఇలాంటి పాత్రని పోషించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
`ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో చిత్రీకరించబడిందని, మలయాళం, కన్నడ, హిందీలోనూ విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పారు. నేను థ్రిల్లర్ చిత్రాలను చూడటం ద్వారా చాలా ఆనందిస్తాను. `నిశ్శబ్దం` నాకు బాగా నచ్చే చిత్రమవుతుంది` అని మాధవన్ చెప్పారు.
`నిశ్శబ్దం` కథ విషయానికి వస్తే, చెవిటి, మూగ లక్షణాలున్న సాక్షి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఖ్యాతి గడించిన ఒక విల్లాలో ఒక విషాద సంఘటనను చూసినప్పుడు ఆమె నేర పరిశోధనలో చిక్కుకుంటారు. పోలీస్ డిటెక్టివ్ బృందం కేసు దర్యాప్తు జరుపుతుంది. ఈ క్రమంలో దెయ్యం నుంచి తప్పించుకున్న యువతి వరకు అనేక మంది అనుమానితుల జాబితాతో సాగే సంఘటనలతో ఈ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ఉండబోతుందట.
సడెన్గా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో చిత్ర బృందంలో టెన్షన్ నెలకొంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా తరహాలో రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుండటంతో ఆశించిన స్థాయిలో స్పందన వస్తుందా అనే టెన్షన్ యూనిట్లో నెలకొంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.