నిధి అగర్వాల్కి గుడి కట్టి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్.. అమ్మడి క్రేజ్ మామూలుగా లేదుగా!
హాట్ అందాల భామ నిధి అగర్వాల్కి అరుదైన అభిమానాన్ని పొందింది. ఈ అమ్మడికి ఫిదా అయిన అభిమానులు ఏకంగా గుడి కట్టుకున్నారు. గుండెల్లో నింపుకున్నా సరిపోదని ఏకంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆమెకి పాలాభిషేకం చేశారు. పూజలు చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో పాపులర్ అయిన నిధి అగర్వాల్ ఆ తర్వాత తన పాపులారిని కోలీవుడ్కి వ్యాపింప చేసుకుంది. ఇటీవల శింబు హీరోగా వచ్చిన `ఈశ్వరన్`, జయంరవి నటించిన `భూమి` చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా ఈ అమ్మడికి మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
కొందరైతే నిధి అందాలను ఫిదా అయ్యారు. ఆమె నటనకు మంత్రముగ్దులయ్యారు. దీంతో ఓ కొత్త ఆలోచనకు వచ్చారు.
తమ ప్రాంతంలో ఏకంగా గుడి కట్టారు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టింప చేసి పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. సంబరాలు చేసుకున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా నిధికి ఇలా తమ ప్రేమని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి సినీ వర్గాలు షాక్కి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే సందర్భంగా హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది నిధి.
బ్లాక్ బనియన్, చిన్న షాట్ ధరించింది. తొడ అందాలను, ఎద అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది.
ఈ హాట్ ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నిధి అగర్వాల్ ఇటీవల బంపర్ ఆఫర్ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్గా ఆఫర్ కొట్టేసింది నిధి.
దీంతోపాటు రవితేజ చిత్రంలోనూ హీరోయిన్గా ఎంపికైందని తెలుస్తుంది. మరోవైపు అశోక్ గల్లా చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.