షాకింగ్ పిక్స్ : నటి పుట్టిన రోజుకి పురుషాంగాన్ని పోలిన కేకు
మన గురించి మీడియాతో సహా అందరూ మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి..ఇదే ఆలోచన చాలా మంది సెలబ్రెటీల మైండ్ లో నిరంతరం తొలిచేస్తూంటుంది. ఆ క్రమంలో తమ మైండ్ లోకి రకరకాల డర్టీ ఐడియాలు వచ్చినా వాటిని ప్రక్కన పెట్టేస్తారు. ఎక్కడ తమను ఫ్యాన్స్ తక్కువ చేసి చూస్తారో అన్న భయం వారిని వెంటాడుతుంది. అయితే కొందరు ఇవన్నీ పట్టించుకోరు. తమకు తోచింది చేసుకుంటూ పోతూంటారు. జనాలు తిట్టినా,మీడియా విమర్శించినా అదో పబ్లిసిటీనే కదా అని మురిసిపోతూంటారు. ఇదిగో నియాశర్మ కూడా అదే బాపతు. తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆమె ఏం చేసింది...జనాలు అంతలా మాట్లాడుకోవటానికి అంటారా..మీరే చూడండి.
నియా శర్మ గురువారం తన 30వ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.అయితే అందులో వింతేముంది..అందరూ పుట్టిన రోజు చేసుకుంటారు కదా అనచ్చు. కానీ అక్కడే ఉంది ట్విస్ట్.
ఆమె బర్త్ డే కోసం తెచ్చిన కేక్ చాలా అసభ్యంగా ఉంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్తో ఉన్న కేక్ను నియా శర్మ కట్ చేసింది.
అంతటితో సరిపెట్టకుండా ఆ ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు.
ఆమె `డర్టీ` సెలబ్రేషన్స్కు అంతకంటే డర్టీగా బదులిచ్చారు. దాంతో ఇప్పుడా విషయాలన్నీ మీడియాలో మారు మ్రోగుతున్నాయి.
టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మ తాజాగా చేసిన పని ట్రోలింగ్కు గురవుతోంది. అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నియా శర్మ తన అందచందాలతో నెటిజన్లని ఆకట్టుకోవడం బాగా తెలుసు. కానీ ఈ సారి మాత్రం నియా ప్రయత్నం బెడిసికొట్టింది.
గతంలోనూ గోల్డ్ అవార్డ్స్ కోసం నియా శర్మ చేసిన ఫోటో షూట్ విమర్శల పాలైంది. వైట్ డ్రెస్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ చేసిన ఫోటో షూట్ వల్గర్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేసారు. నియా శర్మని దూషిస్తూ దారుణంగా కామెంట్స్ చేసారు. ఇప్పుడూ అదే రిపీటైంది.
నియా శర్మ తన హాట్ అండ్ బోల్డ్ చిత్రాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 'నిశ్శబ్దంగా మాట్లాడటం' అని ఆమె తన ఫోటోలు గురించి చెప్తుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించింది.
ఇక ఈ అమ్మడు గత ఏడాది ఆసియాలోనే నంబర్ -1 సెక్సీయెస్ట్ గాళ్ గా గుర్తింపు దక్కించుకుంది. నియా బెస్ట్ యాంకర్, బెస్ట్ ఎక్స్ట్రావర్ట్.
అందాల ఎలివేషన్తో యాంకరింగ్ ని పరుగులు పెట్టిస్తున్న బుల్లితెర ట్యాలెంటుగా గుర్తింపు పొందింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆమెని యూత్ ఫాలో చేస్తున్నారు.
`తెనాలి రామ` అనే కార్యక్రమంతో ఇప్పటికే ఈ భామ యూట్యూబ్లో పాపులారిటీ పెంచుకుంది. `ఏక్ హజారోన్ మే మెరిట్ బెహనా హై` టీవీ షోతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణంగా పెరిగింది.
టివి కార్యక్రమాలలతో బాగా పాపులర్ అయిన నియా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ కావడమే కాదు విమర్శలు కూడా తెచ్చిపెడుతున్నాయి.
తన ప్రస్థానం దశాబ్దం గడిచినా అదే ఫాలోయింగ్ ..ఎక్కడ తగ్గదు . ఆసియాలో సెక్సియెస్ట్ ఉమెన్ జాబితాలో ప్రతి ఏడాది చోటు దక్కించుకుంటోంది . సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నియా అసలు నేహా శర్మ.
నియా స్టైలిష్ డ్రెస్సింగ్ డిజైన్లకు భారీగా అభిమానులున్నారు. ప్రస్తుతం ఆమె ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ ఫేమస్ సీరియల్ 'నాగిని 4' లో నటిస్తోంది.
నియా శర్మ తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలోల అప్లోడ్ చేస్తుంటారు.ఇన్స్టాగ్రామ్లో దాదాపు 4మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు.
అయితే తనకు ఎవరైనా హాట్గా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తే స్వీకరించనని, తనకు అలాంటి కామెంట్లు ఇష్టం ఉండవని ఇటీవల స్పష్టం చేసింది.
నియాశర్మ హాట్, స్టైలిష్ కాళ్లంటే ఆమె ఫాలోయర్లు చాలా ఇష్టపడతారు. తాజాగా నియా శర్మ కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ ఫొటోలే ఆమె కు ఈ స్దాయి హైప్ తెచ్చిపెట్టాయి.
నియాశర్మ సోషల్ మీడియాలో అంతే జోరుగా ఫోటోషూట్లతో టచ్ లో ఉంటుంది. లేటెస్టుగా ఈ బ్యూటీ వేడెక్కించే ఫోటోషూట్తో రెచ్చిపోయింది.
ఈ ఫోటోలు యూత్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. నియాశర్మ ఇకపై పెద్ద తెర నటిగానూ అదృష్టం పరీక్షించుకోనుందని తెలుస్తోంది.
ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ స్పెషల్ ఎడిషన్ బహుమతుల ప్రదానోత్సవం లో అడ్వెంచరస్ షో ట్రోఫీని టీవీ నటి నియా శర్మ సొంతం చేసుకున్నారు. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శిన కనబరిచిన ఆమె.. ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించి విజేతగా నిలిచారు.
ఇక జమాయి రాజా, ఏక్ హజారోం మే మేరీ బహన్ హై వంటి హిట్ సీరియళ్లతో బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘ఖత్రోంకీ ఖిలాడీ’గా నిలిచారు.
ఓ ఆకతాయి ఆ మధ్యన నియాపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ‘నియా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటారని.. భూమిమీద సెలబ్రిటీగా అని పిలువబడే వికారంగా ఉన్నవారిలో ‘నియా శర్మ’ ఒకరని కామెంట్ చేశాడు. దానికి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
నియా దీనిపై స్పందిస్తూ.. ‘ఆ వ్యక్తికి ఇలా కామెంట్ చేయడానికి అతనికి కనీసం సిగ్గు కూడా లేదని మండిపడ్డారు. అదే విధంగా తనకు ఎటువంటి పీఆర్ టీం లేదని.. తాను చాలా సహజంగా ఉంటాను’ అని తెలిపారు.
నియా ఒక్కరే కాదు.. బాలీవుడ్లో చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఎటువంటి కారణం లేకుండానే తీవ్రంగా ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు.
ఢిల్లీలో పుట్టిన నియా... తమ ఫ్యామిలీలో చిన్నది. ఆమెను చిన్నప్పుడు అందరూ బాగా గారం చేసేవారట. అవి అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటుంది.
ఢిల్లీ... రోహిణీలోని జగన్నాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెన్స్లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది నియా.
నియా 2010లో టీవీలో తొలిసారి నటించింది. అక్కడ నుంచి ఆమె వెనతిరిగి చూసుకోలేదు. ఈ పదేళ్లలోనూ ఆమె ఎక్కని ఎత్తులు లేవు అన్నట్లు సాగింది.
స్టార్ ప్లస్ కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్ లో నియా తొలిసారి నటించింది. ఆ తర్వాత బెహెనిన్ లో మెరిసింది. ఆ రెండు సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
కానీ నియాకు బ్రేక్ వచ్చింది మాత్రం..2011లో స్టార్ ప్లస్ సిరీస్ ఏక్ హజారోం మే మేరీ బెహ్నా హైతో. ఆ సీరియస్ లో నియా... మాన్వీగా నటించింది. అది ఆమెకు బ్రేక్ తెచ్చిపెట్టింది.
అక్షయ్ కుమార్ నిర్మాతగా చేసిన షో జమాయ్ రాజాలో నియా... 2014-2016 మధ్య లీడ్ రోల్ పోషించింది. రోష్నీగా దుమ్ము రేపింది. జమాయ్ రాజా 2లో కూడా నటించింది.