- Home
- Entertainment
- Trolls on Keerthy Suresh : ఆ సాంగ్ చేసినందుకు కీర్తి సురేష్ పై దారుణమైన ట్రోల్స్.. టెన్షన్ లో మహేశ్ ఫ్యాన్స్.
Trolls on Keerthy Suresh : ఆ సాంగ్ చేసినందుకు కీర్తి సురేష్ పై దారుణమైన ట్రోల్స్.. టెన్షన్ లో మహేశ్ ఫ్యాన్స్.
‘మహానటి’ లాంటి ఉత్తమ చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ (Keerthy Suresh)కు సోషల్ మీడియాలో హేటర్స్ పెరిగిపోతున్నారు. తన స్థాయికి తగ్గ అవకాశాలను కీర్తి ఎంచుకోవడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
‘నేను శైలజా’.. ‘మహానటి’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతోంది. ఇందుకు కారణం ఆమె కేరీర్ లో తీసుకుంటున్న నిర్ణయాలనే తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో తను నటించిన సినిమాల్లో కేవలం ‘నేను శైలజా.. మహానటి’ రెండు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అసలు ఈ ట్రోలింగ్ కారణం ఏంటంటే.. ఇటీవల ఆమె నటించిన `గాంధారీ` మ్యూజిక్ వీడియో సాంగే. ఈ సాంగ్ వచ్చే ముందు కీర్తిసురేష్(Keerthy Suresh)టాలీవుడ్లో కొత్త ట్రెండ్ని సృష్టించబోతోంది అనే టాక్ కూడా వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శ్రద్దా కపూర్, మరోవైపు రష్మిక మండన్న కూడా బాలీవుడ్ లో స్పెషల్ వీడియో సాంగ్స్ చేశారు. అవి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
అదే తరహాలో కీర్తి సురేష్ ‘గాంధారీ’ స్పెషల్ వీడియో సాంగ్ లో నటించింది. కలర్ఫుల్గా డిజైన్ చేసిన సెట్లో, డాన్సర్లతో కీర్తిసురేష్ ఆడారు. బ్రిందా మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీతోపాటు దర్శకత్వం వహించారు. ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రాయగా.. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చారు. అనన్య భట్ ఆలపించారు. ది రూట్ ప్రొడక్షన్ నిర్మించగా, ఇది సోనీ మ్యూజిక్ ద్వారా యూట్యూబ్లో విడుదలైంది. ఇప్పటి వరకు ఈ సాంగ్ నాలుగున్నర లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఈ సాంగ్ లో నటించడం పట్ల కీర్తి సురేష్ ను మహేశ్ బాబు ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు చాలా ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో నటించే కీర్తి సురేష్ ఇలాంటి బీ గ్రేడ్ మ్యూజిక్ వీడియోలో నటించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన ఎంపిక సరైంది కాదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో రామ్, పవన్ కళ్యాణ్, నాని లాంటి సూపర్ స్టార్లతో నటించిన కీర్తికి అసలేమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం కీర్తి ఈ స్పెషల్ వీడియో సాంగ్ లో నటించడం పట్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అగ్ర స్థాయి హీరోల సరసన నటిస్తూ.. చిన్న చిన్న మ్యూజిక్ వీడియోల్లో నటించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ‘సర్కారు వారి పాట’ మూవీపై ఆశలు పెట్టున్న ఫ్యాన్స్ మొదటి నుంచి ఈ మూవీలో కీర్తి కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సాంగ్ లో కీర్తి నటించడం మూవీపై ప్రభావం చూపుతుందా అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. గాంధారీ మ్యూజిక్ వీడియోతో ఆమెపై వస్తున్న విమర్శలతో ‘సర్కారు వారి పాట’ మూవీ టీం కూడా అన్ హ్యాపీగా ఉన్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం.
ఇదిలా ఉంటే కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన `సర్కారువారి పాట` చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తుంగా, థమన్సంగీతం అందిస్తున్నారు. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరోవైపు చిరంజీవితో `భోళాశంకర్` చిత్రంలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. మరోవైపు నానితో `దసరా` చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తమిళంలో `సాని కయిదమ్`, మలయాళంలో `వాషి` చిత్రాల్లో నటిస్తుంది.