మెట్రో కథలు: వేశ్యగా మారిన బిగ్ బాస్ బ్యూటీ
పలాస ఫేం కరున కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మెట్రో కథలు. ఈ వెబ్ సిరీస్లోనే నందినీ రాయ్ వేశ్య పాత్రలో కనిపించనుంది. తిరువీర్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఆహాలో రిలీజ్ అవుతోంది.
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ప్రస్తుతం సినీ అభిమానులు వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సినిమాల్లో అవకాశాలు ఉన్న తారలు కూడా ఓటీటీలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఇట్రస్టింగ్ వెబ్ మూవీస్ను రూపొందిస్తున్నారు మేకర్స్. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ మెట్రో కథలు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ ఇంట్రస్టింగ్ పాత్రలో కనిపించనుంది. హీరోయిన్ పలు చిత్రల్లో నటించటంతో సపోర్టింగ్ రోల్స్లోనూ నటించిన బ్యూటీ నందినీ రాయ్. ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్లో వేశ్య పాత్రలో నటించింది.
పలాస ఫేం కరున కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మెట్రో కథలు. ఈ వెబ్ సిరీస్లోనే నందినీ రాయ్ వేశ్య పాత్రలో కనిపించనుంది. తిరువీర్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఆహాలో రిలీజ్ అవుతోంది.
తాజాగా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో నందినీ రాయ్ హాట్ హాట్ సన్నివేశాల్లో కనిపించింది. ఓ పెయింటింగ్ పక్కన నిల్చొని తానే స్వయంగా బట్టలు విప్పుతున్న సీన్ చూస్తుంటే కథలో నందిని పాత్రే కీలకమనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్గా మారింది.
2015లో రిలీజ్ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నందినీ రాయ్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో నందినికి అవకాశాలు, గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. వేశ్య పాత్రతో అయిన నందిని కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.