- Home
- Entertainment
- Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
2004లో బాలకృష్ణ నివాసంలో కాల్పుల సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు ముందు రోజు బాలయ్య తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారట. దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలన నిజాలు బయటపెట్టారు.

Nandamuri Balakrishna
2004 లో నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృస్టించింది. ఈ ఘటనతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనే చెప్పాలి. బాలకృష్ణ ఇంట్లో అప్పుడు సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడిపై, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వారు గాయపడడం కూడా జరిగింది.
కాల్పులకు ఒక రోజు ముందు జరిగింది ఇదే
ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసుని కొట్టివేశారు. ఈ సంఘటనపై దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. కాల్పులకు ఒక రోజు ముందు నేను బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణకి ప్రమాదంలో కాలు విరగడంతో ఆపరేషన్ జరిగింది. 15 రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. పరామర్శించడానికి నేను వెళ్లాను.
తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య
అప్పుడు బాలయ్య నాతో చాలా డిప్రెషన్ లో ఉండి మాట్లాడాడు. నేను ఇక బతకను.. పిల్లలని నువ్వే చూసుకోవాలి బావా అని అన్నాడు. అంత తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య ఉండడానికి కారణం ఉంది. కాలు విరగడంతో మునుపటిలా తాను డ్యాన్సులు, ఫైట్స్ చేయలేను ఏమో అనే బాధ ఉంది. లక్ష్మీ నరసింహ చిత్రాన్ని ఎక్కువ సెంటర్స్ లో 100 రోజులు ఆడిస్తాం అని నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుగా చెప్పారు.
లక్ష్మీ నరసింహ మూవీ కూడా కారణమే
కానీ ఎక్కువ సెంటర్స్ లో ఉంచకుండా ఆ చిత్రాన్ని తీసేస్తూ వచ్చారు. ఆ బాధ మరొకటి. ఈ రెండు కారణాల వల్ల బాలయ్య తీవ్ర డిప్రెషన్ లో కనిపించారు. అందుకే నేను ఇక ఉండను అనే మాట బాలయ్య నోటి నుంచి వచ్చింది అని వెంకటేశ్వర రావు అన్నారు.
వైఎస్ఆర్ సేవ్ చేశారా ?
ఆ మరుసటి రోజు నేను వేరే ఫంక్షన్ కి వెళుతుంటే ఇలా జరిగింది అని కాల్ వచ్చింది. వెంటనే కారు వెనక్కి తిప్పు తాను హాస్పిటల్ కి వెళ్లినట్లు వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సంఘటన తర్వాత పురందేశ్వరి, వెంకటేశ్వర రావు.. అప్పటి సీఎం వైఎస్ఆర్ ని కలిసి బాలయ్యని సేవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. తాను దీని గురించి అసలు వైఎస్ఆర్ తో మాట్లాడనేలేదు అని అన్నారు. కానీ ఈ సంఘటనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత సీరియస్ గా మాత్రం తీసుకోలేదు అని వెంకటేశ్వర రావు అన్నారు.

