తల్లి కారణంగా డ్రీమ్నే పక్కన పెట్టిన నమ్రత శిరోద్కర్.. సినిమాల్లోకి ఎంట్రీ వెనుక అసలు కథ
మోడల్గా కెరీర్ ని ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది నమ్రత శిరోద్కర్. కానీ ఆమె అసలు డ్రీమ్ సినిమా కాదట. అమ్మ కారణంగానే దాన్ని వదులుకుందట నమ్రత. తాజాగా ఆ విషయం చెప్పి షాకిచ్చింది.
నమ్రత శిరోద్కర్ పదిహేనేళ్ల క్రితం స్టార్ హీరోయిన్గా రాణించింది. బాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేసింది. బాలీవుడ్ మాదిరిగానే టాలీవుడ్ని ఊపేసేది. కానీ మహేష్ బాబు అడ్డు కట్టవేశాడు. నమ్రత సినిమా కెరీర్కి బ్రేకులు వేశాడు. ఆమెతో ప్రేమలో పడి పెళ్లిచేసుకోవడంతో నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
Tollywood Heroes
నమ్రత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వంశీ` సినిమాలో నటించింది. మహేష్ బాబుకి జోడీగాచేసింది. ఆ సమయంలోనే ఇద్దరుప్రేమలో పడ్డారు. స్నేహంగా ప్రారంభమై సినిమా అయిపోయేలోపు ప్రేమగా మలుపు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పెళ్లిచేసుకున్నారు. మొదట వీరి మ్యారేజ్కి కృష్ణ చెప్పాడనే ప్రచారం జరిగింది. దీని కారణంగానే రహస్యంగా ముంబయిలోపెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే నమ్రత ఇప్పుడు సినిమాలు మానేసి ఫ్యామిలీ, బిజినెస్ని చూసుకుంటుంది. మహేష్బాబు డేట్స్, పారితోషికం, యాడ్స్, బిజినెస్ డీల్స్ సెట్ చేస్తుంది. అలాగే పిల్లల పెంపకం, చదువులు ఇలా అన్నీ తానై చూసుకుంటూ మహేష్ కి బ్యాక్ బోన్గా నిలబడింది నమ్రత. ఫ్యామిలీ రిలేషన్స్ ని కూడా మెయింటేన్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా మల్టీపుల్ వర్క్ తో బిజీగా ఉంది నమ్రత.
నమ్రత మోడల్గా కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. మోడల్ అయ్యాక యాడ్స్ చేయడంతో సినిమా రంగంలోకి వచ్చింది. కానీ ఆమె ముందు అనుకున్నది వేరే అట. తన డ్రీమ్ వేరే ఉందని చెప్పింది నమ్రత. తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలనుకుందట. ఆ దిశగానే ప్రయత్నాలు చేసిందట. కానీ వాళ్ల అమ్మ బెదిరించిందట. అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. దీంతో ఆ ఫీల్డ్ వద్దు, దాన్ని విరమించుకో అని హెచ్చరించిందట నమ్రత అమ్మ. దీంతో చేసేదేం లేక తనడ్రీమ్ ని పక్కన పెట్టింది నమ్రత.
Namrata Shirodkar
అయితే మోడల్ వైపు వెళ్లి అటు సక్సెస్ అయ్యింది. 1993లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్, ఫెమియా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ అందాల పోటీల్లో టైటిల్ విన్నర్గా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. కొన్నాళ్లపాటు అందాల పోటీల్లోనే పాల్గొంది. ఆ తర్వాత 1998లో `మేరే దో అన్మోల్ రతన్` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతోపాటు కన్నడ, మలయాళం, తెలుగు సినిమాలు కూడా చేసింది.
2000లో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మహేష్ బాబు సరసన `వంశీ` చిత్రంలో నటించిన విషయంతెలిసిందే. సినిమా ఆడలేదు. కానీ మహేష్, నమ్రతని కలిపింది. ఆ తర్వాత చిరంజీవితో `అంజి` సినిమా చేసింది నమ్రత. 2004 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత నటిగా కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టింది.
సినిమా కెరీర్ గురించి, మహేష్ బాబు గురించి చెబుతూ, తాను పెళ్లి కి ముందు ఎన్నిసినిమాలైతే చేశానో, అవన్నీ మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. సినిమాల్లోనుంచి కూడా హ్యాపీగా బయటకు వచ్చాను. ఎలాంటి రిగ్రెట్ లేదు. వదులుకున్నాననే బాధ లేదు. మహేష్ బాబు ఉన్నంత సేపు తనకు మరో ప్రపంచం తెలిసేది కాదు, ఇద్దరం ఏకంతంగా ఎన్ని రోజులైనా ఉండేవాళ్లం. అలా సినిమాలు మిస్ అవుతున్న ఫీలింగే వచ్చేది కాదు అని తెలిపింది నమ్రత. సాక్షికి ఇచ్చిన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పింది. అదిప్పుడు వైరల్ అవుతుంది.