రాజమౌళి, నాగార్జున, రణబీర్ ల తెలుగు అరిటాకు భోజన `బ్రహ్మాస్త్రం`.. ఫుడ్ ఐటమ్స్ తెలిస్తే నోరూరాల్సిందే
లగ్జరీ హోటల్స్ లో భోజనాలు చేసే స్టార్స్ ఇప్పుడు అరిటాకులో విందుతో సర్ప్రైజ్ చేశారు. నోరూరించే ఐటెమ్స్ టేస్ట్ చేశారు. వాహ్ అనిపించారు. ఇప్పుడు వీరి అరిటాకు విందు పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నాగార్జున(Nagarjuna), రాజమౌళి(Rajamouli), రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) కొలాబరేషన్లో వస్తున్న సినిమా `బ్రహ్మాస్త్ర`(Brahmastra). ఇందులో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించగా, నాగార్జున ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దీన్ని తెలుగులో సమర్పిస్తూ, ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చెన్నైలో సందడి చేసింది యూనిట్. నాగ్, రాజమౌళి, రణ్బీర్ పాల్గొన్నారు.
ఇందులో వీరు ముగ్గురు చేసిన విందు భోజనం ఇప్పుడు అందరి హృదయాలకు గెలుచుకుంటుంది. అరిటాకు భోజనం చేయడం ఆశ్చర్య పరుస్తుంది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంది. చెన్నైలో ఈ ముగ్గురు కలిసి ఓ మామూలు హోటల్లో లంచ్ చేయడం విశేషం.
నాగార్జున, రాజమౌళి, రణ్బీర్ కపూర్ కలసి అరిటాకులో భోజనం చేశారు. వారు ఆరగించిన మీల్స్ లోని ఐటెమ్స్ ఏంటనేది ఆరా తీసే పనిలో పడ్డారు అభిమానులు. అందులో ప్రధానంగా పాపడం, టొమాటో చట్నీ, సాంబారు, ఓ ఫ్రై, పప్పు కర్రీస్,బోందీ లడ్డు, బెల్లన్నం, ఓ మిర్చీ ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం వీరు భోజనం చేస్తున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్స్టార్స్ ఇలా సింపుల్గా అరిటాకులో భోజనం చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే దీన్ని కూడా వీరి తమ చిత్ర ప్రమోషన్కి వాడుకుంటుండటం విశేషం.
బుధవారం చెన్నైలో ఈ ముగ్గురు సందడి చేశారు. ప్రెస్మీట్లో సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇండియన్ కల్చర్ని, వేదాలను, ఇండియన్ అస్త్రాలను ఆవిష్కరించే చిత్రమిదని, ఇదొక కొత్త అనుభూతిస్తుందని చెప్పారు నాగార్జున. ఈ అంశాలే తనని బాగా ఇన్స్పైర్ చేసినట్టు చెప్పారు.
అయార్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ యాక్షన్, విజువల్ వండర్లో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.