పవన్ ఊసరవెల్లి...ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు ప్రకాష్ రాజ్...నాగబాబు కౌంటర్
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికలు నటుల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. నటుడు ప్రకాష్ రాజ్ నిన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ ని ఊసరవెల్లితో పోల్చగా...ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని నాగబాబు ప్రకాష్ రాజ్ ని హెచ్చరించారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మొదట నేరుగా జనసేన పార్టీ జిహెచ్ ఎమ్ సి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే ఆ తరువాత బీజేపీకి మద్దతు తెలుపుతూ, తమ అభ్యర్థులను ఉపసంహరింపజేశారు.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రకాష్ రాజ్ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తనను నిరాశపరిచినట్లు తెలియజేశారు. ఒకసారి మోడీని తిడుతూ మరోసారి పొగుడుతూ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు.
బీజేపీతో పొత్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లిగా ప్రకాష్ రాజ్ పోల్చడం జరిగింది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు జనసేన వర్గాలలో దుమారం రేపగా, నటుడు నాగబాబు ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డాడు.
రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయి, అవి దీర్ఘకాలంలో పార్టీకి, ప్రజలకు మేలు చేస్తాయి. పవన్ తీసుకున్న బీజీపీతో పొత్తు నిర్ణయం కూడా అలాంటిదే అన్నాడు. బీజీపీతోనే దేశాభివృద్ధి, ఏపీ అభివృద్ధి అన్నాడు.
ఇక ప్రకాష్ రాజ్ మంచి గురించి మాట్లాడలేని కుసంస్కారి అన్నాడు. గతంలో అనేక మార్లు డేట్స్ విషయంలో నిర్మాతలను ఇబ్బందిపెట్టాడు అన్నారు. బీజీపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి డిబేట్ లో సమాధానాలు లేక నీళ్లు నమిలిన నీవు, ఎంతటి మేధావివో తెలుసన్నారు.
బీజేపీ గురించి నీవు ఎంత చెత్త వాగుడు వాగినా వాళ్ళు ఏమి అనకపోవడానికి కారణం ప్రజాస్వామ్యానికి ఆ పార్టీ ఇస్తున్న గౌరవం అన్నాడు. ఇకపై పవన్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడని, నాగబాబు ప్రకాష్ రాజ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
మొత్తంగా ప్రకాష్ రాజ్ మరియు నాగబాబు మాటల యుద్ధం అటు రాజకీయ వర్గాలలో, సినీ వర్గాలలో దుమారం రేపుతోంది.