ఎన్టీఆర్పై మెగా బ్రదర్ నాగబాబు సెన్సేషనల్ కామెంట్..పండగ చేసుకుంటున్న నందమూరి ఫ్యాన్స్
మెగా బ్రదర్ నాగబాబు..యంగ్ టైగర్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఈ రెండు ఫ్యామిలీల మధ్య కాస్త గ్యాప్ కొనసాగుతున్న నేపథ్యంలో బారియర్స్ ని బ్రేక్ చేసి నాగబాబు.. ఎన్టీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి నాగబాబు వ్యాఖ్యలకు, నందమూరి ఫ్యాన్స్ ఎందుకు ఖుషీ అవుతున్నారనేది చూస్తే..
ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలతోపాటు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. జెమినీ టీవీలో ఇది త్వరలో ప్రసారం కానుంది.ఇటీవల విడుదలైన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ సందర్భంగా మీడియా కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజకీయ ఎంట్రీపై కూడా ఆయన మాట్లాడారు. దాని గురించి మాట్లాడే సమయం, సందర్భంగా కాదని, తర్వాత ఓ రోజు తీరిగ్గా వేడి వేడి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై నెలకొన్న సస్పెన్స్ ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏపీలో వైఎస్జగన్, టీడీపీ వాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. నచ్చితే ప్రశంసించడం,నచ్చకపోతే విమర్శించడం ఆయన స్టయిల్. ఏపీ ప్రభుత్వ తీరుపై, వైసీపీ నాయకులపై ఆయన దుమ్మెత్తిపోస్తుంటారు.
మరోవైపు నాగబాబు టీవీ హోస్ట్ గా, జడ్జ్ గా బిజీగానే ఉంటున్నారు. మొన్నటి వరకు ఆయన `జబర్దస్త్` షోలకు జడ్జ్ గా ఉండి ఆకట్టుకున్నారు. రోజాతో కలిసి ఆయన మెప్పించారు. వీరి కాంబినేషన్కి మంచి పేరుంది.
కానీ వేరే ఛానెల్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ ని వదిలేశారు. `అదిరింది` లాంటి షోలు చేశారు. ఇప్పుడు ఆ షోస్ కూడా లేవు. సొంతంగా తన యూట్యూబ్ ఛానెల్లో స్టాండప్ కామెడీ షోని నిర్వహిస్తున్నాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాగబాబు చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాడు.
దీంతో రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. తరచూ రాజకీయాలపై ఆయనస్పందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్నాడు. అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నాగబాబు అభిమానులతో ఛాట్ చేశాడు.
ఈ ఛాటింగ్లో ఓ అభిమాని ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత` చిత్రంలోని వారి పాత్రలను ప్రస్తావిస్తూ, `వీరరాఘవ గురించి చెప్పు నారప్ప రెడ్డి` అని అన్నారు. దీనికి నాగబాబుస్పందిస్తూ, ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయన `నేటి తరం టార్చ్ బేరర్` అని ప్రశంసించాడు. ఎన్టీఆర్పై ఈ రేంజ్లో ప్రశంసలు కురిపించడంతో నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. నాగబాబుకి థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్లో ఆ సినిమాలోనే ఉన్న విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్లో రెండు పెద్ద ఫ్యామిలీలు. ఒకరికొకరు దీటుగా సినిమాలు చేస్తుంటారు. వీరి సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటాపోటీగా విడుదలవుతుంటాయి. ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టి నాగబాబు ఇలా మాట్లాడటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. `అరవిందసమేత`లో నాగబాబు, ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`లో కొమురంభీమ్గా నటిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇది ఏప్రిల్లో ప్రారంభం కానుంది.