అన్నయ్య వెంటపడ్డ అమ్మాయిలెవరో తెలుసుః నాగబాబు పంచుకున్న రేర్ ఫ్యాక్ట్స్
మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా ఈ సారి నిరాడంబరంగా ఆయన బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విశెష్ చెబుతున్నారు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ కబుర్లేంటో చూద్దాం.
చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని నాగబాబు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. చిరు తనని చిన్నప్పుడే కాపాడట. ఆ విషయం నాగబాబు తెలియజేశారు.
చిరంజీవి తమ ఇంట్లో పెద్ద కావడంతో ఆయన బర్త్ డే అంటే తమకు పండుగలాగా ఉంటుందని, ఓ పండుగ మాదిరిగానే జరుపుకుంటామని నాగబాబు చెప్పారు. ఆయన బర్త్ డేకి ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటామని, కానీ ఈ సారి కలుసుకోలేకపోతున్నామని తెలిపారు.
చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్ అనే విషయం తెలిసిందే. అందరు ఆ పేరును పలకలేక కేఎస్వీ అనేవారట. పలువురు ఆటపట్టించేవాళ్ళు కూడా.
అమ్మానాన్నలు చెప్పిన పని చిరు నో చెప్పకుండా చేసేవాడట. కానీ నాగబాబు చేసేవాడు కాదని చెప్పారు. అయినా చిరంజీవి,నాగబాబు, పవన్ కళ్యాణ్, ఇద్దరు సిస్టర్స్ ఇలా ఐదుగురు మధ్య విడదీలేని బాండింగ్ని తమ అమ్మానాన్నలు ఏర్పర్చారని తెలిపాడు.
చిన్నప్పుడు చిరుకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. ఎక్కువగా ఇతర అంశాలపైనే ఫోకస్ పెట్టేవాడట. బాడ్మింటన్ బాగా ఆడేవాడట. అంతేకా నాటకాలు కూడా వేసేవాడని, ఆసమయంలో ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నాడని తెలిపారు.
స్కూల్ టైమ్లో, కాలేజ్ టైమ్లో చిరుకు భారీ ఫాలోయింగ్ ఉండేదట. తన స్నేహితులు గోపికలు మాదిరిగా ఎప్పుడూ చుట్టూ ఉండేవారట. అంతేకాదు అమ్మాయిలు సైతం చిరుని చూసి ఫిదా అయ్యేవాళ్లట. ఆయన వెంట పడే అమ్మాయిలను రహస్యంగా తాను గమనించే వాడినని నాగబాబు తెలిపారు.
చిన్నప్పుడు చిరు తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లినప్పుడు నాగబాబుని కూడా తీసుకెళ్ళాడట. కానీ నాగబాబుకి ఈత రాక మునిగిపోతుండటంతో తాను గమనించి ఒడ్డుకు చేర్చాడని, తాను ఇప్పుడు బతికి బట్టకట్టానంటే ఆయన పుణ్యమే అని, లేకపోతే ఆ రోజే చనిపోయేవాడినని నాగబాబు తెలిపారు.
చిరంజీవి ఎన్సీసీ మాదిరిగా ఉండే ఆర్టీసీ క్యాంప్లోనూ విద్యార్థిగా ఉన్నాడట. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తమ క్యాంపు విద్యార్థులంతా ఢిల్లీలోని రాష్ట్రపతి రోడ్లో మార్చ్ నిర్వహించారట. కానీ అదే చిరంజీవి కేంద్ర పర్యాటక మంత్రిగా అదే ఢిల్లీ రోడ్లో ప్రయాణించడని తెలిపి గర్వపడుతున్నాడు.
చిరంజీవి పట్టుదల ఉన్న వ్యక్త అని చెబుతూ, చెన్నైలో ఓ హీరో సినిమా ప్రివ్యూకి వెళితే ఆయన్ని అవమాన పరిచాడట. అదే రోజు తాను నెంబర్ వన్ హీరో అవుతానని ఛాలెంజ్ చేశాడట. ఆ తర్వాత నెంబర్ వన్ హీరో అయి ఆ హీరోకి, అక్కడున్న వారిని షాక్ గురి చేశాడని తెలిపారు.
హీరోగా మారిన కొత్తలో దాదాపు ఓ పదిహేనేళ్ళు రోజూ 18 గంటలు పనిచేశాడట. మూడు షిఫ్ట్ ల్లో సినిమా షూటింగ్లో పనిచేసేవాడని నాగబాబు తెలిపారు. ఆ సమయంలో తాను సహయంగా ఉండేవాడినని తెలిపారు. అన్ని రోజులపాటు హాలిడే అనేదే తీసుకోలేదన్నారు.
ఎవరైనా తన ముందు కామెడీ చేస్తే చిరు నవ్వడట. ఆ సదరు వ్యక్తి ఎలా కామెడీ చేస్తున్నాడటనేది గమనిస్తాడని, తాను ఇప్పుడు ఇంతగా కామెడీ పండిస్తున్నాడంటే అదే కారణమని తెలిపాడు. అంతేకాదు కామెడీ పండించే హీరోల్లో ఇండియాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవినే అని వెల్లడించారు. వారికంటే బెటర్ కామెడీ చేసే హీరోలు ఎవరూ లేరని చెప్పారు.
తమ కుటుంబంలో అత్యంత రెస్పాన్సిబుల్ పర్సన్ చిరంజీవి అన్నయ్యే అని తమ అందరి బాధ్యతలు తనే చూసుకున్నాడని, తమ అందరి పెళ్లిళ్ళు చేశాడని తెలిపారు. అంతేకాదు మమ్మల్ని యాక్టింగ్లోకి తీసుకురావాలనేది ఆయన నిర్ణయమే అని చెప్పాడు.
చిరంజీవి మాటలు ఫిరంగి గుండులా ఉంటాయని, ఆయన చాలా సింపుల్గా చెప్పినా అవి తమని ఎంతో ఇన్స్పైర్ చేస్తాయన్నాడు. ఇక నేడు తన పుట్టిన రోజు, వినాయక చవితి కావడంతో చిరంజీవి, రామ్చరణ్, సురేఖ, ఉపాసన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది.