కొత్తగా పెళ్ళైన హీరోతో `ఇస్మార్ట్` బ్యూటీ రొమాన్స్
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో టాలీవుడ్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ తన టాలెంట్తో మెస్మరైజ్ చేస్తుంది. రెండేళ్ళ క్రితం `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ సోయగం.. తక్కువ టైమ్లోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
గ్లామర్తోనే కాదు, యాక్టింగ్ వైజ్గానూ మెస్మరైజ్ చేస్తూ టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తున్న ఈ భామ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది.
నితిన్ హీరోగా బాలీవుడ్లో విజయం సాధించిన `అంధాధున్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అందులో కీర్తి సురేష్ నేమ్ కూడా ఉంది.
కానీ వాళ్ళెవరూ ఓకే చెప్పలేదు. కారణం ఇందులో హీరోయిన్ పాత్రకి అంతగా ప్రయారిటీ లేకపోవడమే. దీంతో ఇప్పుడు నభా నటేష్ని సంప్రదించగా, ఆమె సూత్రప్రాయంగా ఓకే చెప్పిందట.
అయితే ఇందులో బాలీవుడ్తో పోల్చితే తెలుగులో పాత్రకి కాస్త ప్రయారిటీ పెంచుతున్నారట. గ్లామర్ డోస్ని కూడా పెంచుతున్నట్టు తెలుస్తుంది. గ్లామర్ విషయంలో నభా నటేష్ రెచ్చిపోతుంది. కాబట్టి ఈ రోల్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఇదే నిజమైతే ఇటీవలే కొత్తగా పెళ్ళి చేసుకున్న యంగ్ హీరోతో నభా రొమాన్స్ చేయబోతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం నభా తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న `అల్లుడు అదుర్స్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటు సాయితేజ్ హీరోగా తెరకెక్కుతున్న `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రంలోనూ హీరోయిన్గా ఆడిపాడుతుంది.
మరి ఈ సినిమా `ఇస్మార్ట్ శంకర్`ని మించిన పాపులారిటీని, క్రేజ్ని తీసుకొస్తాయేమో చూడాలి.