‘ఆమె కథ’ సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్
ఈటీవీలో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
సినిమా, టెలివిజన్ రంగాల్లో కరోనా మహమ్మారీ గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు లేక సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా షూటింగ్ లు ప్రారంభం కాగా నటీనటులకు కరోనా సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. ఇప్పటికే సూర్యకాంతం అనే సీరియల్లో నటిస్తున్న ప్రభాకర్ అనే ఆర్టిస్ట్కు, మరో సీరియల్ గృహలక్ష్మిలో నటించే హరికృష్ణ అనే నటుడికి కరోనా సోకింది.
దీంతో.. ఈ రెండు సీరియల్స్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. కాగా.. తాజాగా మరో రెండు సీరియల్స్ షూటింగ్ కి బ్రేకులు పడే అవకాశం కనపడుతోంది.మరో సీరియల్ నటికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈటీవీలో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
ప్రస్తుతం నవ్య స్వామి.. ఈ కరోనా వైరస్ కి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సీరియల్స్ లో లీడ్ రోల్.. నవ్య కావడంతో.. ఆమె లేకుండా సీరియల్ కంటిన్యూ చేసే ఛాన్స్ లేదు.
కాగా..నవ్య స్వామి నటిస్తున్న ఆమె కథ సీరియల్ లో.. బిగ్ బాస్ రవికృష్ణ హీరోగా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కంటే కూతరినే కనాలి, నా పేరు మీనాక్షీ సీరియల్స్ ద్వారా నవ్య తెలుగు బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు.
చక్కటి అందంతో పాటు మంచి అభినయంతో ప్రతీ ఇంట్లోనూ మహిళా ప్రేక్షకాభిమానులను ఈ భామ సొంతం చేసుకుంది.
కెరీర్ తొలినాళ్లలో డాక్టర్ అవ్వాలనుకున్న ఈ భామ చివరకు యాక్టర్ అయ్యింది. ముందుగా తమిళ్ సీరియల్ వాణి - రాణి ద్వారా తెరంగేట్రం చేసిన ఈ భామ, అటు తెలుగు, కన్నడ సీరియల్స్ లో కూడా రాణించింది.
ఆమె స్వస్థలం కర్ణాటక రాష్ట్రం కాగా.. తెలుగులో బాగా రాణించింది. తెలుగు భాషలో స్పష్టంగా కూడా మాట్లాడగలదు.