MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?

ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?

దివంగత స్టార్ కామెడియన్ ఎమ్మెస్ నారాయణను ఫిల్మ్ ఇండస్ట్రీ మోసం చేసిందా..? మరణం తరువాత కూడా అన్యాయం చేసిందా..? ఎమ్మెస్ కు జరిగిన అవమానం ఏంటి..? ఆయన తనయుడు విక్రమ్ ఏమన్నారంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 21 2024, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగువారు మర్చిపోలేని కమెడియన్ ఎమ్మెస్ నారాయణ.. కడుపుబ్బా నవ్వులు పంచుతూనే.. సడెన్ గా  విషాదాన్నినింపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఎమ్మెస్ నారాయణ. ఆయన మరణంతో ఎంతో గొప్ప కమెడియన్ ను టాలీవుడ్ కోల్పోయింది.

ఆయన మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ధర్మవరపు సుబ్రహ్మణ్య, కొండవలస, ఏవీఎస్, వేణుమాధవ్, లక్ష్మీపతి, మల్లిఖార్జున రావు, ఇలా  చాలా మంది స్టార్ కమెడియన్లు ఒకరి తరువాత మరొకరు వరుసగా కన్ను మూశారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దాంతో టాలీవుడ్ లో ఒక రకంగా కమెడియన్లకు కరువు వచ్చిందని చెప్పవచ్చు. అయితే అందరిమాట ఏమో కాని.. ఎమ్మెస్ నారాయణకు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అన్యాయం జరిగిందంటున్నారు ఆయన తనయుడు విక్రమ్. కమెడియన్ గా కెరీర్ పీక్ లో ఉండగానే అనారోగ్యం వెంటాడింది ఎమ్మెస్ ను .. దాంతో  2015 లో  ఆయన కన్నుమూశాడు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకు విక్రమ్ నారాయణ ఎన్నో కష్టాలుపడ్డారట. 
 

36

ఎమ్మెస్ బ్రతికుండగా.. తన తనయుడిని కూడా ఇండస్ట్రీలో నిలబెట్టాలని చూశారు. ఎమ్మెస్ స్వయంగా డైరెక్ట్  చేస్తూ.. విక్రమ్ ను హీరోగా పెట్టి.. కొడుకు సినిమాను తెరకెక్కించాడు. కాని ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత కూడా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేశారు. కాని ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆతరువాత తండ్రి మరణం విక్రమ్ ను మరిన్ని  కష్టాల్లొకి నెట్టింది. ఈ విషయాలను  ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని ఎంతో బాధపడ్డాడు విక్రమ్. ఎమ్మెస్ నారాయణను ఇండస్ట్రీలో చాలామంది మోసం చేశారట. 

46

మరీ ముఖ్యంగా ఎమ్మెస్  చేసిన సినిమాల డబ్బులు కూడా ఇవ్వలేదట. ఈస్టార్ కమెడియన్  చనిపోయే ముందు 30 సినిమాలు చేశారట.  అయితే ఈ సినిమాలకు ఆయనకు కంప్లీట్ గా డబ్బులు ఇవ్వలేదట. ఆయన  చనిపోయాక ఈ సినిమాలన్ని రిలీజ్ అయ్యాయట. అయితే ఆ సినిమాలకు సంబంధించిన రెమ్యూనరేషన్స్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడట. స్టూడియోల చుట్టూ తిరిగి ఆయన తండ్రిగారికి రావాల్సిన రెమ్యూనరేషన్స్ ని దక్కించుకున్నాడట. 

ఎంత కష్టపడినా కూడా వాటిలో 60 శాంతం కంటే ఎక్కువ రాబట్టలేకపోయారట. అలా తన తండ్రికి మోసం చేయాలని చూశారంటూ.. బాధపడ్డారు విక్రమ్. అంతే కాదు  తన తండ్రి కష్టం వృధా పోకూడదు అనే ఉద్దేశ్యంతోనే.. ఆ డబ్బులు వసూలు చేశాను కాని.. డబ్బుపై ఆశతో కాదు అన్నారు విక్రమ్. ఇక ఎమ్మెస్ మరణం తరువాత విక్రమ్ కు అవకాశాలు రాలేదు. సినిమాలు చేద్దామనకున్నా.. ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. 
 

56

దాంతో తను చదివిన లా ను జీవనాధారం చేసుకుని.. ప్రాక్టీస్ చేస్తున్నాడట. విక్రమ్. తనకు ఇప్పటికీ సినిమాలు చేయాలని ఉంది. ఎవరైనా అవకాశం ఇస్తే.. ఏ పాత్రకైనా నేను రెడీ అంటున్నాడు విక్రమ్. ఇక  టాలీవుడ్ లో  లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో ఏం ఎస్ నారాయణ పేరు కచ్చితంగా ఉంటుంది.  ఎమ్మెస్  కామెడీ టైమింగ్ మూములుగా ఉండదు. 

66

ఒక  లెక్చరర్ అయ్యుండి.. సినిమాల వైపు ఆకర్షితుడై.. నాటకాలు ఆడటం ప్రారంభించాడు ఎమ్మెస్.  గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత నాటకాలకు స్క్రిప్ట్స్ ని అందిస్తూ, అలా సినీ రంగంలోకి రచయితగా అడుగుపెట్టి, 1994 వ సంవత్సరం లో మోహన్ బాబు హీరో గా నటించిన ‘ఏం ధర్మరాజు MA’ చిత్రం తో తొలిసారి నటుడిగా వెండితెర మీద కనిపించాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved