చిన్నపిల్లాడైపోయిన మోహన్ బాబు... వైరల్ అవుతున్న ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ !
లాక్ డౌన్ తరువాత మాల్దీవ్స్ స్టార్స్ తో పోటెత్తాయి. టాలీవుడ్ కి చెందిన కాజల్, రకుల్, సమంత, తాప్సి వంటి హీరోయిన్స్ మాల్దీవ్స్ లో తమ వెకేషన్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది మంచు ఫ్యామిలీ.
విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంతో పాటు మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన భార్య నిర్మలా దేవి, కూతురు లక్ష్మీ, అల్లుడు శ్రీనివాసన్ తో మాల్దీవ్స్ వెళ్లారు.
మాల్దీవ్స్ బీచ్ లలో మోహన్ బాబు రొమాంటిక్ గా మారిపోయారు. ఆయన తన భార్యతో కలిసి సాయంకాలం వేళ సాగర తీరంలో కుబుర్లు చెవుతూ గడిపారు.
మోహన్ బాబును నిర్మలా దేవి కౌగిలించుకుంటున్న రొమాంటిక్ ఫోటో మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అలాగే తన మనవరాలు విద్యా నిర్వాణతో ఆడుకుంటూ మోహన్ బాబు చిన్న పిల్లాడు అయిపోయాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే మోహన్ బాబు తనలోని కొత్త కోణం పరిచయం చేశారు.
ఇక మంచు లక్ష్మీ అందమైన సాగర తీరంలో భర్తతో గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ వెకేషన్ పిక్స్ మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఎప్పుడూ షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండే మోహన్ బాబు, లక్ష్మీ ఇలా మాల్దీవ్స్ వెకేషన్ కి రావడం జరిగింది.
ఇక నటిగా వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీ రాణించడం జరిగింది. అమెరికాలో టాక్ షోలను హోస్ట్ చేసిన ఘనత ఆమెది.
మరో వైపు మోహన్ బాబు చాలా కాలం తరువాత హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
సోషల్ మెస్సేజ్ తో కూడిన సెటైరికల్ మూవీగా సన్ ఆఫ్ ఇండియా ఉండే అవకాశం కలదని సమాచారం.
ఇక మంచు విష్ణు మోసగాళ్లు అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుండగా... మంచు మనోజ్ అహంబ్రహ్మస్మి పేరుతో మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు.