MM Keeravani : ‘ఆస్కార్’ వల్ల సినిమాలు సక్సెస్ అవ్వవు.. ఎంఎం కీరవాణీ కీలక వ్యాఖ్యలు
‘ఆస్కార్’ అవార్డు గ్రహీత, టాప్ మ్యూజిషియన్ ఎంఎం కీరవాణీ MM Keeravani కీలక వ్యాఖ్యలు చేశారు. తను అందుకున్న Oscar Awardతో రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం ఉండదంటూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ గురించి తెలియని వారుండరు. ఆయన పాటలు ఎంత మధురంగా ఉంటాయో తెలిసిందే. 1990 నుంచి ఇప్పటి వరకు 190 చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో పాటు పాడారు. సంగీత రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించి ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు చూసేలా చేశారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkp912q1vdjsad9fs49h9t1t/mm-keeravani--1--jpeg_300x168xt.jpg)
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలో నాటు నాటు పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన సంగీత ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఊగిపోయేలా చేశారు. సినీ అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు (Oscar Award)ను సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాయి... ‘ఆస్కార్’ అందుకున్న తర్వాత కూడా కీరవాణి సినిమాలకు వర్క్ చేస్తూనే వస్తున్నారు. ‘జమ్మ పంచాయతీ’, ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’, ‘బింబిసార’, ‘చంద్రముఖి 2’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
ఇప్పుడు అక్కినేని నాగార్జున Nagarjuna లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామిరంగ’ Naa Saami Ranga తో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణీ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.... ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘నాగార్జునతో కలిసి పనిచేయడం మొదటి నుంచి సంతోషంగా ఉంటుంది. ఆయనతో చేసిన సినిమాలు విజయం అవుతూనే వస్తున్నాయి. నా సామిరంగ.. కూడా మంచి సక్సెస్ అవుతుంది’ అని అన్నారు.
అయితే... ‘ఆస్కార్’ అవార్డు తర్వాత మీరు చేస్తున్న సినిమాల్లో ఇదొక్కటి కావడంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు... ‘ఆస్కార్ అనేది సినిమా సక్సెస్ పై ఏమాత్రం ప్రభావం చూపించదు. డైరెక్ట్ బాగా తీయాలి. నా వరకు నేనూ బాగా వర్క్ చేయాలి.. దాన్ని జనాలు మొచ్చాలి.. అలా సినిమా సక్సెస్ అవుతుంది. కానీ సినిమాలకు హైప్ ను తెచ్చేది మాత్రం రిలీజ్ కు ముందు వచ్చే పాటలే.’ అని చెప్పుకొచ్చారు.
‘నా సామిరంగ’ చిత్రానికి డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ టీజర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. మూవీలో ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.