జూ.చిరుని పరిచయం చేస్తూ ఎమోషనల్ అయిన మేఘనా రాజ్.. ఎంత క్యూట్గా ఉన్నాడో..
కన్నడ నటి మేఘనా రాజ్ తన కుమారుడిని పరిచయం చేసింది. గతేడాది గుండెపోటుతో మరణించిన చిరంజీవి సర్జా, తనకు జన్మించిన చిన్నారి జూనియర్ చిరు(సింబా)ని ప్రేమికుల రోజు మేఘనా రాజ్ అభిమానులకు పరిచయం చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఇందులో తమ జూ. చిరుని చూపించారు మేఘనా. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా మేఘనా భావోద్వేగానికి గురయ్యారు.
'నేను పుట్టకముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న తరుణంలో మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా.
మీ అందరి ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు..నేను మీ జూనియర్ సీ' అంటూ మేఘన తన కొడుకును ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతో ఎమెషనల్గా సాగే ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.
ఈ వీడియోలో తమ పెళ్లి నాటి వీడియో క్లిప్ ని, తన కుమారు జూ.చిరు జన్మించిన నాటి క్లిప్ని, ఇప్పుటి క్లిప్ని యాడ్ చేసి స్పెషల్గా రూపొందించారు.
2017 అక్టోబర్ 22న చిరంజీవి సర్జా, నటి మేఘనారాజ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. గ్రాండ్గా వీరి వివాహం జరిగింది.
సరిగ్గా మూడేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్ 22న వీరికి కుమారుడు జన్మించారనే విషయాన్ని పంచుకుంటూ మేఘనా ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అయితే నటుడు చిరంజీవి గతేడాది జూన్ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
కేవలం 36ఏళ్ల వయుసులోనే చిరు మరణించడం వారి ఫ్యామిలీలోనే కాదు, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదం నెలకొంది. చిరంజీవి మరణించే నాటికి మేఘన ఐదు నెలల గర్భిణిగా ఉంది.
చిరు సోదరుడు ధృవ సర్జా ప్రస్తుతం హీరోగా `పొగరు` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులోనూ ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది.