రామ్ చరణ్, అల్లు అర్జున్ ను చూస్తే కడుపు మండిపోతోంది.. వారివల్లే అలాంటి దుస్థితి.. చిరు షాకింగ్ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిద్దరిని చూస్తే కడుపు మండిపోతోందని అంటూ ఆవేదన వ్యక్తం చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవికి కలిగిన ఇబ్బందిని బహిర్గతంగా వివరించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) దిక్సూచిగా మారారు. 40 ఏండ్లకు పైగా తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి యంగ్ హీరోలకు కూడా బాటలు వేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త టాలెంట్ కు కూడా చిరంజీవి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఇప్పటికీ అన్నయ్య పట్ల సినీ ప్రియులకు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు, నటీనటులకు ఎంతో అభిమానం ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన కీర్తి నేటికీ పెరుగుతూనే ఉంది. అలాంటి చిరుకి తన ఇంట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ తో అర్థం అవుతోంది.
మెగాస్టార్ కొద్ది రోజులు ఆయా ఈవెంట్లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun)పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ వల్ల తనకు ఇంట్లో గుర్తింపు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతరం పిల్లలు ఆ తరం నటీనటుల గొప్పను గుర్తించడం లేదని కాస్తా ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ గా ఎదిగినప్పటికీ తన ఇంట్లోని పిల్లలే చిరు స్థాయిని గుర్తించడం లేదని బాధపడ్డారు. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, అల్లు అర్జున్ ‘పుష్ఫ’ లాంటి చిత్రాల్లో నటించడంతో ఈతరం పిల్లలు వారినే గొప్ప నటులుగా గుర్తిస్తున్నారని చెప్పారు.
దీంతో తమ ఇంట్లోని పిల్లలకు చిరు తన సూపర్ హిట్ సినిమాల గురించి తానే చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. దీంతో రియలైజ్ అయి ‘గాడ్ ఫాదర్’ సినిమాను తన ఇంట్లో ఉన్న ఎనిమిదేళ్లు, తొమ్మిదేళ్లు, ఐదేళ్ల పిల్లలు నాలుగైదు సార్లు చూశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్రెండ్ మారుతుండటంతో అలనాడు నటీనటులు ఎదుర్కొన్న సవాళ్లు కనుమరుగై పోతోందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం రావడం భావితరాలకు ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆశించారు. లేదంటే తెలుగు దిగ్గజాలను మరిచిపోయేలా పరిస్థితి వస్తుందని, స్టార్లుగా ఎదిగినా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిందేనని సరదాగా కామెంట్ చేశారు.