అనసూయ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అది చెప్పలేదు..మెగా ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు
అనసూయపై మెగా ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్పైనుంచే అందరు చూస్తుండగానే బోల్డ్ కామెంట్ చేశారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న సీక్రెట్ని వెల్లడించారు. ఇన్నాళ్లు చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుతున్నానని, అంతకంటే నీ గురించి ఎక్కువ ఏం చెప్పాలన్నారు.
ఇటీవల కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన `చావు కబురు చల్లగా` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
అల్లు అర్జున్ గెస్ట్ గా పాల్గొన్న ఈ ఈవెంట్లో అనసూయ, ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ పాల్గొని మాట్లాడారు.
ఇందులో అనసూయ ఓ ఐటెమ్సాంగ్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఆ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
అయితే ఈ ఈవెంట్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి చెప్పుకొచ్చారు అరవింద్. అందరిపై ప్రశంసలు కురిపించారు.
అనసూయ వంతు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `అనసూయ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతకంటే ఏం చెప్పాలి` అంటూ ఒక్కసారిగా అనేశారు ఈ మెగా ప్రొడ్యూసర్.
దీంతో అక్కడున్న వారితోపాటు, ఆడియెన్స్ సైతం ఘోల్లుగా నవ్వారు. అప్పుడు లైట్గా తీసుకున్నా, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.
ఈ లేడీ హాట్ యాంకర్ పై అల్లు అరవింద్ అంతటి వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేపుతుంది. మెగా ప్రొడ్యూసర్పై తన ఇష్టాన్ని ఇలా అందరి ముందు చెప్పడం హాట్ టాపిక్గా మారింది.
చాలా మంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. రకరకాల ఎక్స్ ప్రెషన్స్, సీన్స్ పెట్టి మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుండటం విశేషం.
అనసూయ ఈ ఈవెంట్లో శారీలో మెరిసింది. హైలైట్గా నిలిచింది.
అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` యాంకర్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు, ఐటెమ్ సాంగ్స్ చేస్తూ ఊపేస్తుంది.