సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో ఫ్యాన్స్ వాదన కరెక్టా.. వాళ్లపై ట్రోలింగ్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యారు. తేజ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యాడు.
sai dharam tej accident
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యారు. తేజ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యాడు. కొన్ని తీవ్ర గాయాలు కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే తేజు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది అని పోలీసులు తరచుగా క్యాంపైన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తేజు హెల్మెట్ ధరించి ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే తేజు ప్రమాదానికి అతివేగం కారణం అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
దీనిపై పోలీసులు తేజుపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. మరో వాదన ప్రకారం ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఇసుక, మట్టి ఉండడంతో బైక్ అదుపుతప్పినట్లు చెబుతున్నారు. పైగా తేజు మద్యం కూడా సేవించలేదని పోలీసులు ధృవీకరించారు.
ఇంత మంది పెళ్ళిళ్ళు చేసుకోవడంతో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సైతం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు రాద్ధాంతం చేసేలా అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మీడియా సంస్థలపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతివేగమే కారణం అయితే బైక్ నుజ్జు నుజ్జు అయి ఉండేది అని అంటున్నారు. కానీ బైక్ సాలిడ్ గా కనిపిస్తోంది.
లాక్ డౌన్ టైమ్లో బడా ప్రొడ్యూసర్ దిల్రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రానా తాను ప్రేమించిన అమ్మాయి `ఎస్` చెప్పడంతో ఆ తంతు కానిచ్చేశాడు. నితిన్ సైతం తన ప్రియురాలిని అఫీషియల్గా తన వశం చేసుకున్నాడు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ సైతం తన ప్రియురాలినే మ్యారేజ్ చేసుకున్నారు. వీరితోపాటు చిన్న చిన్న నటులు కూడా పెళ్ళి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలో మ్యారేజ్ చేసుకోబోతుంది. నిన్ననే తాను మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు స్టార్ హీరోయిన్ కాజల్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల, సిసి టివి లాంటి టెక్నాలజీ వల్ల అన్ని విషయాలు అందరికి తెలుస్తున్నాయి. లేకుంటే బైక్ స్పీడ్ ఎంత.. తేజు మద్యం సేవించాడా లేదా అంటూ బురదజల్లేలా మీడియా ఛానల్స్ డిబేట్లు పెట్టేవి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే... ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
సాయిధరమ్ తేజ్ గాయాలు ప్రమాదకరం కాకపోయినప్పటికీ 24 గంటల తర్వాత అతడి హెల్త్ కండిషన్ పై క్లారిటీ వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతానికి తేజు ఔటాఫ్ డేంజర్ అని తెలిపారు. అపోలో ఆసుపత్రికి మెగా కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు. తాజాగా రాంచరణ్, ఉపాసన అపోలోకి వెళ్లి తేజు హెల్త్ కండిషన్ గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు.