బాత్ టబ్లో పొట్టి డ్రెస్లో రెచ్చిపోయిన పెద్ద పాప.. మంచు లక్ష్మి చివరికి దాన్ని కూడా వదలడం లేదుగా!
సీనియర్ భామ మంచు లక్ష్మి ఇటీవల కాలంలో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే గ్లామర్ ట్రీట్లతోనూ అదరగొడుతుంది.
మంచు లక్ష్మి.. టాలీవుడ్లో ఓ స్పెషాలిటీ కలిగిన నటి, యాంకర్, నిర్మాత. ఆమె యాంకర్గా ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ ప్రోగ్రామ్స్ చేసింది. సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. తనవంతుగా తాను చేసే `మనం సైతం` అనే షో ద్వారా హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది.
నిర్మాతగానూ చాలా సినిమాలు నిర్మించింది. సక్సెస్ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా అందుకుంది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. నెగటివ్ రోల్స్ లోనూ అదరగొట్టింది. కానీ చాలా కాలంగా యాక్టింగ్కి దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇటీవల మంచు లక్ష్మి పూర్తిగా మారిపోయింది. ఆమె ఫామ్లో ఉన్న హీరోయిన్ల మాదిరిగానే వరుసగా ఫోటో షూట్లు చేస్తుంది. గ్లామర్ ట్రీట్ ఇస్తూ అదరగొడుతుంది. హాట్ ట్రీట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఏకంగా బాత్ టబ్ని ఎంచుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఆమె తాజాగా సైమా ఈవెంట్లో పాల్గొంది. అక్కడి బాత్ టబ్లో ఇలాంటి క్రేజీ పోజులిచ్చి ఆకట్టుకుంది. సైమాలో ట్రెండీ వేర్లో రచ్చ చేస్తుందీ సీనియర్ పాప.
మంచు లక్ష్మి పొట్టి దుస్తులు, చీర, ట్రెండీ వేర్స్ లోనూ మెరుస్తూ కెమెరాకి కిర్రాక్ పోజులిస్తుంది. తాజాగా ఈ సీనియర్ భామ.. పొట్టి డ్రెస్లో రెచ్చిపోయింది. బాత్ టబ్లో ఫోటో షూట్ చేసింది. తన థైస్ అందాలను చూపిస్తూ చిలిపిగా పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ప్రస్తుతం నటిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంది. ఆమె తండ్రి మోహన్బాబుతో కలిసి `అగ్నినక్షత్రం` అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి తను కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు. టీజర్కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అప్డేట్ లేదు.
ఇటీవల మోహన్బాబు, మంచు విష్ణు `కన్నప్ప` పేరుతో భారీ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి నటిస్తుందా తెలియాల్సి ఉంది. కానీ ఆమె హీరోయిన్లకి పోటీగా గ్లామర్ షో చేస్తుండటం విశేషం. ఆయా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ కుర్రాళ్లని ఆకట్టుకుంటున్నాయి.