MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `పోకిరి` టైమ్‌లో చేసిందే ఇప్పుడు చేస్తున్న మహేష్‌.. ఫ్యాన్స్ కి లెటర్‌.. రికార్డులు బ్రేక్‌ చేయడానికేనా?

`పోకిరి` టైమ్‌లో చేసిందే ఇప్పుడు చేస్తున్న మహేష్‌.. ఫ్యాన్స్ కి లెటర్‌.. రికార్డులు బ్రేక్‌ చేయడానికేనా?

మహేష్‌బాబు చూడబోతుంటే `పోకిరి` సినిమా సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఆయన విడుదల చేసిన ఓపెన్‌ లెటర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. దీంతో అనేక ఊహాగనాలకు తావిస్తుంది. పలు సందేహాలు కలుగుతున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : May 07 2022, 07:32 PM IST| Updated : May 08 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మహేష్‌బాబు(Maheshbabu) ప్రస్తుతం `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata)లో నటించారు. ఈ చిత్రం ఈ నెల(మే) 12న భారీగా విడుదల కాబోతుంది. `గీతగోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించింది. బ్యాంక్‌ కుంభకోణాలు, హవాలా నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. కచ్చితంగా `సర్కారు వారి పాట` బ్లాక్‌ బస్టర్‌గా నిలవబోతుందనే సంకేతాలనిస్తుంది. ఇందులో మహేష్‌ చెప్పిన డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకోవడం విశేషం. 

26

ఇక `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Sarkaru Vaari Paata Pre Release Event)ఈ రోజు(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహేష్‌ తన అభిమానులకు ఓపెన్‌ లెటర్‌ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.

36

ఇందులో మహేష్‌ (Mahesh Letter) చెబుతూ, `ప్రముఖ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్‌ వంటి ప్రముఖ సంస్థలపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌, అచంట రామ్‌, అచంట గోలు సంయుక్తంగా నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` షూటింగ్‌ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో `సరేగమ` కంపెనీ ద్వారా మార్కెట్‌లో విడుదలై, రేటింగ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో వస్తోన్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయండి` అని పేర్కొన్నారు మహేష్‌. 

46

దీంతోపాటు తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. త్రివిక్రమ్‌(Trivikram) తో చేయబోతున్న సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ తెలిపారు. `దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించే చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలు కానుంది` అని పేర్కొన్నారు మహేష్‌. ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఆయన లెటర్‌ ద్వారా తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. 

56

అయితే ఆయన ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రావడం లేదా? అనే సందేహాలు ఊపందుకున్నాయి. ఎలాగూ ఈవెంట్‌లో మాట్లాడతారు, అదే విషయాన్ని ఈవెంట్‌లోనే చెప్పొచ్చు. కానీ ఇలా ముందుగానే ఓపెన్‌గా అభిమానులకు లెటర్‌ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ లెటర్‌ వెనకాల మహేష్‌ సెంటిమెంట్‌ దాగుందని తెలుస్తుంది. మహేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `పోకిరి` సినిమా టైమ్‌లోనూ ఇలానే లెటర్‌ విడుదల చేశారట మహేష్‌. అదే సెంటిమెంట్‌ని ఇప్పుడు రిపీట్‌ చేస్తున్నట్టు టాక్‌. 
 

66

2006లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన `పోకిరి` చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా సుమారు రూ.66కోట్లు వసూలు చేసి అప్పటి వరకు హైయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇండస్ట్రీకి కలెక్షన్ల టేస్ట్ ని చూపించడంతోపాటు కలెక్షన్లు అనే ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. సినిమా పరంగానూ ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. అయితే ఇప్పుడు `సర్కారు వారి పాట` చిత్రంలోనూ అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని, అంతటి హిట్‌ కావాలనే ఉద్దేశ్యంతో మహేష్‌ ఈ లెటర్‌ విడుదల చేసినట్టు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్‌. మరి ఇందులో నిజమెంతా ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేష్‌ సెంటిమెంటే అయితే `సర్కారు వారి పాట` ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి మహేష్‌ ఫ్యాన్స్ ని భలేగా సర్‌ప్రైజ్‌ చేశారని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved