సాగరకన్యగా మహేష్ భామ.. స్విమ్ సూట్లో సముద్రానికే వేడిపుట్టిస్తున్న కియారా
మహేష్ భామ కియారా అద్వానీ సొరచేపలా మారిపోయింది. ఎల్లో స్విమ్ సూట్లో సముద్రానికే వేడిపుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న వీడియోలో సాగర కన్యలా సముద్రంలో స్విమ్ చేస్తూ కేకపెట్టిస్తుంది.
మహేష్తో `భరత్ అనేనేను` చిత్రంలో నటించి మెప్పించిన కియారా అద్వానీ తాజాగా ఓ వీడియోని పంచుకుంది. సముద్రంలో తాను జలకాలాడుతుంది.
బికినీ ధరించి సముద్రపు అంచులకు వెళ్లింది. ఈ బ్యూటీని చూస్తుంటే సాగరకన్యలాగే ఉంది. సముద్రంలోని అడుగు భాగానికి వెళ్లి మరి పోజులిచ్చింది.
ఈ సందర్భంగా క్యాప్చర్ చేసిన వీడియోని తన ఇన్స్టాలో పంచుకుంది కియారా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంది.
ప్రతి రోజు ఎన్విరాన్మెంట్ డేనే అని చెబూ పంచుకున్న ఈ వీడియోలో కియారా సొరచేపలా కనిపిస్తుంది. సముద్రంలోనూ తన అందం రెట్టింపయ్యింది.
తాజాగా ఈ వీడియో, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు ఆమెని సాగర కన్య అని,సొర చేప అని కామెంట్ చేస్తున్నారు.
తెలుగులో మహేష్తో `భరత్ అనే నేను`, రామ్చరణ్తో `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించింది కియారా అద్వానీ. ఆ తర్వాత తెలుగులో నటించలేదు.
ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమైంది. ఇటీవల `కబీర్సింగ్`తో సూపర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది.
ప్రస్తుతం `షేర్షా`, `భూల్ భులైయ్యా 2`, `జగ్ జుగ్ జీయో`, `మిస్టర్ లేలే` చిత్రాల్లో నటిస్తుంది.
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా, కెమెరాకి కూడా చిక్కిన సందర్భాలున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మోస్ట్ 50 డిజైరబుల్ ఉమెన్స్ 2020 జాబితాలో కియారా మూడో స్థానం సంపాదించుకోవడం విశేషం.