క్రిస్మస్ వేడుకల్లో మహేష్ ఫ్యామిలీ.. ముద్దుల తనయ సితార క్యూట్ ఫోటోస్ వైరల్
క్రిస్మస్ వేడుకల్లో సినీ తారలు పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ చెట్టుని అలంకరించి విషెస్ తెలిపారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు ముద్దుల తనయ సితార క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హల్చల్ చేయగా, ఆయా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
మహేష్ తనయ సితార ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మహేష్ని, నమ్రతని మించి యాక్టివ్గా ఉంటూ, అప్పుడే సెలబ్రిటీ హోదాని పొందుతుంది.
తన యూట్యూబ్ ఛానెల్లో చిల్డ్రన్కి సంబంధించి యాక్టివిటీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు చిలిపి పనులు, ట్రెండీ దుస్తుల్లో మెరుస్తూ అలరిస్తుంది.
తాజాగా సితార క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంది. సెన్సిల్ కలర్ తరహాలో చిన్న చిన్న బెలూన్స్ , లైటింగ్తో క్రిస్మస్ చెట్టుని డిజైన్ చేసి ఫోటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు మహేష్ ఫ్యాన్స్ నే కాదు, నెటిజన్లని విశేషంగా అలరిస్తున్నారు. ట్రెండ్ అవుతున్నాయి.
క్రిస్మస్ ట్రీ వద్ద గిఫ్ట్ చూసుకుంటు చిరునవ్వులు చిందిస్తున్న సితార
క్రిస్మస్ వేడుకల్లో మహేష్, నమ్రత, సితార, గౌతమ్ తదితరులు.
మహేష్బాబు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు వంశీ పైడిపల్లి సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం.
మహేష్బాబు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు వంశీ పైడిపల్లి
ఇదిలా ఉంటే ఇటీవల ఓ యానిమేషన్ సంస్థ ఓపెనింగ్ కార్యక్రమంలోనూ తల్లి, నటి నమ్రతతో కలిసి సందడి చేసింది సితార.