- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ వదులుకున్న మల్టీస్టారర్ మూవీ ఏంటో తెలుసా? మహేష్ బాబుకి జాక్ పాట్
పవన్ కళ్యాణ్ వదులుకున్న మల్టీస్టారర్ మూవీ ఏంటో తెలుసా? మహేష్ బాబుకి జాక్ పాట్
Pawan Kalyan-Mahesh Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా హిట్ సినిమాలు వదులుకున్నాడు. కానీ ఆయన ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ని మిస్ చేసుకున్నారు. దాన్ని మహేష్ చేసి హిట్ కొట్టాడు. అదేంటో చూస్తే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pawan Kalyan
Pawan Kalyan-Mahesh Babu: పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చాలా సినిమాలు మిస్ చేసుకున్నారు. ఆయన మిస్ చేసుకున్న చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అదే సమయంలో డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ పవన్ తనకు సెట్ అయ్యే మూవీస్ మాత్రమే చేస్తాడు. తనకు కంఫర్ట్ గా అనిపించే మూవీస్ చేస్తాడు. తన ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న డైరెక్టర్స్ కే ప్రయారిటీ ఇస్తాడు.
pawan kalyan mahesh babu
అయితే పవన్ ఓ మల్టీస్టారర్ మూవీని మిస్ చేసుకున్నాడు. ఆయనతో చేయాల్సిన సినిమాని మహేష్ బాబు చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు. మరి పవన్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బస్టర్ ఏంటి? మహేష్ చేసిన ఆ మల్టీస్టారర్ మూవీ ఏంటి? అనేది చూస్తే,
gopala gopala
వెంకటేష్తో కలిసి పవన్ కళ్యాణ్.. `గోపాల గోపాల` చిత్రంలో నటించారు. కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెంకీ షాప్ హోనర్గా, పవన్ దేవుడిగా కనిపించాడు. బాలీవుడ్లో వచ్చిన `ఓ మై గాడ్`కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. యావరేజ్గానే ఆడింది. అయితే ఈ మూవీ కంటే ముందే వెంకీతో పవన్ ఓ సినిమా చేయాల్సింది. అదే పవన్ మిస్ చేసుకున్నారు.
venkatesh, mahesh babu
అదేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వెంకీ, మహేష్ బాబు కలిసి నటించిన `సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు` మూవీలో నటించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో వెంకీ మొదట హీరోగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు చేయాల్సిన పాత్రకి పవన్ని అప్రోచ్ అయ్యారట.
కానీ ఆయన నో చెప్పారు. ఆ తర్వాత మహేష్ వద్దకు వెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ ఓకే చెప్పాడనే కారణంగానే మహేష్ ఈ మూవీ చేశారు. వీరికి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. అయితే ముందు ఈ పాత్ర కోసం రజనీకాంత్ని అడిగాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ ఆ సమయంలో రజనీ ఆరోగ్యం సరిగా లేదు, దీంతో చేయలేనని చెప్పాడట.
మొత్తంగా పవన్ మంచి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇదే కాదు `పోకిరి` మూవీ కూడా ముందు పవన్ వద్దకు వెళ్లిందట. కానీ ఆయన రిజెక్్ట చేశాడని, తర్వాత మహేష్ వద్దకు వెళ్లింది. అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.
వెంకీ, మహేష్ బాబు చేసిన `సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు` మూవీ పెద్ద హిట్ అయి ఇప్పటికీ ఫ్యామిలీ చిత్రాల్లో క్లాసిక్గా నిలిచిపోయింది. ఇందులో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రస్తుతం పవన్ `హరిహర వీరమల్లు`, `ఓజీ` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు మహేష్ ఇప్ఉపడు రాజమౌళితో `ఎస్ఎస్ఎంబీ29`లో నటిస్తున్నారు.
also read: శోభన్బాబు అభిమానించే హీరో ఎవరో తెలుసా? దేవుడిలాంటి భావన.. రెబల్స్టార్ చెప్పిన మతిపోయే నిజాలు