MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR లో రాంచరణ్ సీన్ ని మించేలా జక్కన్న ప్లాన్, 3000 మందితో పడవల్లో మహేష్ బాబు ఫైట్

RRR లో రాంచరణ్ సీన్ ని మించేలా జక్కన్న ప్లాన్, 3000 మందితో పడవల్లో మహేష్ బాబు ఫైట్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. 

2 Min read
Tirumala Dornala
Published : Apr 20 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu, Ram Charan

Mahesh Babu, Ram Charan

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ సాధించి తెలుగు సినిమా గురించి హాలీవుడ్ వాళ్ళు కూడా మాట్లాడుకునేలా చేసిన జక్కన్న ఈ సారి.. మహేష్ మూవీని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

25
Mahesh Babu

Mahesh Babu

రాజమౌళి ఈ చిత్రం కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని రంగంలోకి దించారు. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. చాలా పకడ్బందీగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, ఒరిస్సాలో మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

35
ssmb 29

ssmb 29

ఈ కొత్త షెడ్యూల్ గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సన్నివేశంలో నీటిలో సాగే యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. ఈ సీన్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ తో పాటు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారట. వందలాది బోట్స్ లో 3 వేల మందితో మహేష్ బాబు పోరాటం చేస్తాడని అంటున్నారు. ఊహించుకుంటుంటేనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ సీన్ ని రాజమౌళి ఎలా చిత్రీకరిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ ఎంట్రీ సీన్ కోసం వేలమంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సన్నివేశంలో రాంచరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. అంతకి మించేలా మహేష్ బాబు పోరాటం 3 వేలమందితో ఉండబోతోందా అనే అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. 

45
Mahesh Babu

Mahesh Babu

దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఈ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ సన్నివేశం చిత్రీకరణ దాదాపు 30 రోజుల పైనే ఉంటుందని అంటున్నారు. అంటే SSMB 29 చిత్రంలో ఈ సన్నివేశం ఎంత కీలకం కానుందో అర్థం అవుతోంది. 

55

ఈ సన్నివేశం కోసం మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3 వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved