అమ్మ చివరికోరిక తీర్చలేకపోయిన మహేష్ బాబు...? కుమిలిపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్..?
ఈ మధ్యే తన తల్లిని కోల్పోయాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తల్లి ఇందిరా దేవి మరణంతో బాగా కృంగిపోయాడు సూపర్ స్టార్. అంతే కాదు ఆమె చివరి కోరికను కూడా తీర్చలేకపోయాడట మహేష్. ఈ విషయంలో ఇంకా బాధపడిపోయినట్టుతెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబకు తన తల్లి ఇందిరా దేవి అంటే ప్రాణం. ఆమె తనకు దైవంతో సమానం అంటూ చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. తనకు బాధ అనిపించినా.. సినిమా రిలీజ్ ఉన్నా.. అమ్మ దగ్గరకు వెళ్లి.. ఆమె చేతి కాఫీ తాగడం అలవాటన్నారు మహేష్. అది తనకు ఆశీర్వాదం అన్నారు మహేష్.
ఇందిరా దేవి కూడా ఎవరితోను ఎక్కువగా మాట్లాడరు. ఆమె తనుకు చాలా క్లోజ్ గా ఉన్నవారితోనే సరదాగా మాట్లాడుతారు. ఇక మహేష్ ను ప్రాణంగా పెంచుకున్నారు ఇందిరా . మహేష్ బాబు కూడా అమ్మచాటు బిడ్డగా పెరిగారు. మహేష్ స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా తనకోసం ఏమి అడగలేదట ఇందిర. కాని ఒక కోరిక మాత్రం కోరారట.
మహేష్ తో ఒక సారి ఇలా అన్నారట ఇందిరా దేవి. తన మనవరాలు సితారకు ఓణీల వేడుకు చేయించమని అడిగిందట ఇందిర. కాని అటువంటివి తనకు ఇష్టం లేకపోవడంతో.. ఎందుకు ఇవన్నీ.. అని మహేష్ అన్నారట. అప్పటికే తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇది తన చివరి కోరికగా తీసుకుని.. సితారకు ఓణీలు వేయమని అడిగిందట.
కాని వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని మహేష్ బాబు మాత్రం.. ఇప్పుడు అప్పుడూ అంటూ లేట్ చేస్తూ వచ్చాడని సమాచారం. అయితే ఇప్పుడు తల్లి మరణంతో పుట్టెడు ధుఖంలో మునిగి ఉన్న మహేష్ ను. ఈ బాధ వేధిస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు నాన్నమ ఇందిరా దేవి అంటే.. సితారకు కూడా ప్రాణం. ఆమెను కలవడానికి వచ్చినప్పుడు కూడా ఆమెతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేదట సీతా పాప. అంతే కాదు తన తల్లి ఇందిరా దేవి పోలికలతో... అచ్చం అమ్మలాగా ఉండటంతో.. సితార అంటే మహేష్ కు ప్రాణం అని తెలుస్తోంది.
ఇక 70 ఏళ్లు దాటిన ఇందిరా దేవి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హాస్పిటల్లో కన్ను మూశారు. చాలా కాలంగా ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ఇందిరా దేవి మరణంతో.. అటు కృష్ణతో పాటు మహేష్ బాబును కూడా సినీ రాజకీయ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.