- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి, మహేంద్ర.. పద్ధతి మార్చుకుంటే మంచిదంటూ?
Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి, మహేంద్ర.. పద్ధతి మార్చుకుంటే మంచిదంటూ?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని(devayani)సాక్షి గురించి మాట్లాడడంతో అప్పుడు రిషి ఇంకొకసారి సాక్షి పేరు ఈ ఇంట్లో వినిపించ కూడదు అని దేవయానికి స్ట్రాంగ్ గా వార్ణింగ్ ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత మహేంద్ర(Mahendra) కూడా భోజనం తినకుండా చేతులు కడిగేస్తాడు. అప్పుడు మహేంద్ర, జగతి ఇద్దరూ కలసి దేవయానికి బాగా బుద్ధి చెబుతారు.
మరొకవైపు వసు, రిషి(rishi)కి లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు వసు పెట్టిన మెసేజ్ చూసి వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అప్పుడు ప్రేమతో తనలో తానే మాట్లాడుకుంటూ వసు(vasu)తో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటాడు. మరొకవైపు వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఆనంద పడుతూ ఉంటుంది.
వసు కూడా రిషి(rishi) జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అలా వారిద్దరు కాసేపు ప్రేమగా చాట్ చేసుకుంటూ ఉంటారు. మరుసటి రోజు వసు, రిషి దగ్గరికి వెళ్ళి మీరు ముందులాగా నాతో ఉండడం లేదు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని రిషి ని అడగగా నాకు పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో జగతి(jagathi), మహేంద్ర లు కాలేజీ కి వస్తారు.
అప్పుడు మహేంద్ర(mahendra)రిషిధార కనిపించడం లేదు అని అనడంతో ఇంతలో అక్కడికి వచ్చి ఏమన్నారు డాడ్ అని అడగగా అప్పుడు మహేంద్ర ఏమీ లేదు అని కవర్ చేసుకుంటాడు. అప్పుడు రిషి జగతితో మాట్లాడుతూ మేడం మీ స్టూడెంట్ కి నా తరఫున ఒక మాట చెప్పండి అని అనగా అప్పుడు జగతి (vasu)కావాలనే రిషిని ఆటపట్టించడం కోసం వసు పేరు తప్ప మిగిలిన స్టూడెంట్స్ పేర్లు చెబుతుంది.
అప్పుడు రిషి(rishi) వసు గురించి మాట్లాడుతూ తను ఈ మధ్య కాలంలో తన జీవిత లక్ష్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు ఒకసారి చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత మహేంద్ర, జగతి లు రిషి, వసు(vasu)ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వసు రావడంతో ప్రాజెక్టు గురించి వసుని డైరెక్ట్ గా రిషితోనే మాట్లాడు అని చెబుతుంది జగతి.
ఆ తర్వాత వసు,రిషి(rishi)కి కాఫీ ఇస్తుంది. అప్పుడు రిషి, వసుపై అరవడంతో వసుధార అక్కడి నుంచి ఫీలవుతూ వెళ్ళిపోతుంది. మరొక వైపు దేవయాని ఇళ్ళు సైలెంట్ గా ఉండడంతో దేవయాని ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి, సాక్షి లను ఎలా అయినా ఒకటి చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు(vasu),రిషి ఇద్దరు బయటికి వెళ్లి ప్రేమగా మాట్లాడు కుంటూ ఉంటారు.