హీరోయిన్ కామ్నజఠ్మలాని కూతుల్లను చూశారా? ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి!
అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది కామ్నా జఠ్మలానీ.. కుర్రాళ్ళ కలల రాణిగా ఉన్న కామ్నా జఠ్మలానీకి ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం

Kamna Jethmalani
2005లో విడుదలైన ప్రేమికులు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది కామ్నా జఠ్మలానీ. అందుకు రణం మూవీతో బ్రేక్ వచ్చింది. దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రణం సూపర్ హిట్ అయ్యింది.
Kamna Jethmalani
అనంతరం టాలీవుడ్ తో పాటు ఆమెకు సౌత్ లో ఆఫర్స్ పెరిగాయి. తమిళ్, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. కామ్నా జఠ్మలానీ నటించిన మరో హిట్ మూవీ బెండు అప్పారావు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్. కామ్నా జఠ్మలానికి బ్రేక్ ఇచ్చే మూవీ పడింది.
బెండు అప్పారావు చిత్రానికి ఈ వి వి సత్యనారాయణ దర్శకుడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. బెండు అప్పారావు మంచి విజయం సాధించింది. కామ్నా కెరీర్ కి ఏమంత బూస్ట్ ఇవ్వలేదు లేదు ఆ చిత్రం.
అనంతరం అల్లరి నరేష్ కి జంటగా యాక్షన్ త్రీడి, భాయ్ చిత్రాలు చేసింది. అవి డిజాస్టర్స్ అయ్యాయి. తెలుగులో కామ్నా చివరి చిత్రం వ్యవస్థ. ఇది నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. కామ్నా నటనకు ప్రశంసలు దక్కాయి.
కామ్నా 2014లో సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కామ్నాకు ఇంత పెద్ద కూతుళ్లు ఉన్నారా అని జనాలు ఆశ్చర్య పోతున్నారు. కామ్నా ఫ్యామిలీ మీద మీరు కూడా ఓ లుక్ వేయండి..