శారీలో సెక్సీగా కీర్తి సురేష్...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..!
ఓనమ్ వేడుకలు జరుపుకుంటున్న కీర్తి సురేష్ నాజూకు అందాలు కట్టిపడేస్తున్నాయి. సాంప్రదాయ శారీలో కీర్తి సురేష్ గ్లామర్ ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించేలా ఉంది. తన ఓనమ్ వేడుకలకు సంబందించిన ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
కేరళ కుట్టి కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో దూసుకుపోతుంది. అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. తెలుగులో మిస్ ఇండియా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అలాగే దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా గుడ్ లక్ సఖీ చిత్రంలో కీర్తి ప్రధాన పాత్ర చేస్తుండగా పలు భాషలలో విడుదల కానుంది.అలాగే నితిన్ కి జంటగా రంగ్ దే మూవీలో హీరోయిన్ గా చేస్తుంది.
మలయాళ డైరెక్టర్ జి సురేష్ కుమార్, తమిళ నటి మేనకల కూతురైన కీర్తి అనతి కాలంలో హీరోయిన్ గా ఉన్నత స్థాయికి వెళ్ళింది. మహానటి చిత్రం తరువాత కీర్తి సురేష్ ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ చిత్రంతో అధ్బుత నటిగా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుచుకుంది.
ఓనమ్ పండుగ నేపథ్యంలో కీర్తి కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులతో పండుగను ఘనంగా జరుపుకుంటుంది. పండగ సంధర్భంగా సాంప్రదాయ దుస్తులలో ముస్తాబైన కీర్తి సురేష్ అధ్బుతంగా ఉంది.
బంగారు రంగు అంచు కలిగిన గోధుమ వన్నె చీర, మెరూన్ కలర్ జాకెట్ ధరించి ఉన్న కీర్తి సురేష్ చాలా సెక్సీగా ఉంది. సదరు ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓనం పండుగకు తమ అభిమాన హీరోయిన్ సూపర్ ఫీస్ట్ ఇచ్చిందంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహానటి చిత్రం కోసం బరువు పెరిగిన కీర్తి సురేష్ ఈ మధ్య హార్డ్ వర్క్ చేసి సన్నబడ్డారు. శారీలో నాజూగ్గా ఉన్న కీర్తి సురేష్ కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది.