కన్నాంబ కాలం నుండి కృతిశెట్టి వరకు టీనేజ్ లోనే మేకప్ వేసేసిన స్టార్ హీరోయిన్స్...
ఉద్యోగానికి, వివాహానికి ఏజ్ లిమిట్ ఉంది కానీ.. హీరోయిన్ కావడానికి లేదు. కన్నాంబ కాలం నుండి కృతి శెట్టి జనరేషన్ వరకు అనేక మంది టీనేజ్ దాటకుండానే హీరోయిన్స్ గా వెండితెరకు పరిచయమయ్యారు. వారిలో శ్రీదేవి లాంటి హీరోయిన్స్ సుదీర్ఘ కాలం వెండితెరను ఏలారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి 13 ఏళ్లకే హీరోయిన్ గా మారారు. ఆమె తర్వాత అనేక మంది అతి తక్కువ ప్రాయంలోనే హీరోయిన్స్ అయ్యారు. మన జనరేషన్ లో కొందరు కొందరు అమ్మాయిలు మైనారిటీ తీరకుండానే మేకప్ వేసేశారు. వాళ్ళు ఎవరో చూద్దామా...
కృతి శెట్టి (Krithi Shetty)మొదటి చిత్రం ఉప్పెన గత ఏడాది విడుదల కాగా అప్పటికి ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇక కృతి ప్రస్తుత వయసు 18ఏళ్ళు. హ్యాట్రిక్ హిట్స్ తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె నటించిన ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు (Bangarraju)సూపర్ హిట్స్ గా నిలిచాయి.
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది తమన్నా (Tamannah). టాలీవుడ్ లో ఇప్పటికీ బడా హీరోల పక్కన చేస్తున్న తమన్నా 15 ఏళ్ల ప్రాయంలో హీరోయిన్ గా మారారు. ఆమె మొదటి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా 2005లో విడుదలైంది. తమన్నా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించారు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్నారు.
సిమ్లా ఆపిల్ ఛార్మి కౌర్ (Charmi Kaur)16 ఏళ్లకే హీరోయిన్ గా మారారు. 2002లో విడుదలై 'నీతోడు కావాలి'తో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. నీతోడు కావాలి సినిమా విడుదలయ్యే నాటికి ఛార్మి వయసు కేవలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ పక్కన చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా విరామం తీసుకొని, నిర్మాతగా కొనసాగుతున్నారు.
సీరియల్స్, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన హన్సిక మోత్వానీ (Hansika Motwani)దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయ్యారు. దర్శకుడు పూరి తెరకెక్కించిన దేశముదురు 2007లో విడుదలైంది.16 ఏళ్లకే హన్సికను పూరి హీరోయిన్ చేశాడు. హన్సిక సైతం ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ సరసన నటించింది.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్. ఈ ముద్దుగుమ్మ ఉయ్యాలా జంపాలా(2013) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా అప్పుడు అవికా వయసు 16. తెలుగులో సినిమా చూపిస్త మావా, ఎక్కడి పోతావు చిన్నవాడా, వంటి హిట్ చిత్రాల్లో అవికా నటించారు.
కొత్త బంగారులోకం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్.2008లో విడుదలైన కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. టీనేజ్ గర్ల్ రోల్ లో యూత్ ని శ్వేతా గిలిగింతలు పెట్టారు. కొత్త బంగారు లోకం సినిమా చేసేనాటికి శ్వేతా వయసు 17ఏళ్ళు మాత్రమే.
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ప్రేమకథ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న నందితా రాజ్ మొదటి చిత్రం నీకు నాకు డాష్ డాష్(2012). ఈ సినిమా చేసేనాటికి నందిత వయసు 17ఏళ్ళు మాత్రమే. ప్రేమ కథ మూవీ తర్వాత నందితకు బ్రేక్ రాలేదు. ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో జస్ట్ ఓ క్యామియో రోల్ చేశారు.
యంగ్ హీరో అఖిల్ డెబ్యూ చిత్రం అఖిల్(2015) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సయేశా సైగల్ కూడా అతి తక్కువ ప్రాయంలో హీరోయిన్ అయ్యారు. అఖిల్ మూవీ నాటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఇక సయేశా తనకంటే వయసులో దాదాపు ఇరవైయేళ్లు పెద్దవాడైన హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు.