మీకు ఉద్యోగం కావాలా?.. అయితే కియారాని సంప్రదించండి!
బాలీవుడ్ ప్రీతి కియారా అద్వానీ ఉద్యోగాలిస్తుందట. నిరుద్యోగులకు ఓ దారి చూపిస్తానని చెబుతోంది. అందుకోసం ఓ సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఆ విశేషాల మహేష్ భామ వెల్లడించింది.
కియారా అద్వానీ బాలీవుడ్లో హాట్ కేక్ లాంటి హీరోయిన్. `కబీర్ సింగ్` విజయం ఈ బ్యూటీలో టాప్ హీరోయిన్ని చేసింది. అక్షయ్ కుమార్ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ని చేశాడు. ప్రస్తుతం కియారా కోసం దర్శక, నిర్మాతలే కాదు, హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. అది ఈ భామ రేంజ్.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్గా ఎదిగిన కియారా ఇప్పుడు ఉద్యోగాలిస్తుందట. లాక్డౌన్, కరోనా వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు కొత్త ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. దీంతో తాను మార్గం చూపిస్తానని తెలిపింది. ట్విట్టర్ ద్వారా ఓ వీడియోని పంచుకుంది కియారా.
ఇందులో ఆమె స్పందిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వెతకడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి సందర్భంలో ఇండీడ్ హెల్ప్ అనే జాబ్ సైట్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
ఉద్యోగాల అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యమని తెలిపింది. మరింత గైడెన్స్ కోసం ఇండీడ్ని సంప్రదించండని తెలిపింది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి తన వంతు సాయం చేయడం కోసం కియారా ఇండీడ్ హెల్స్ అనే జాబ్ సైట్తో కలిసి పనిచేస్తుంది. దానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. తాజాగా ఆ వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
ఈ ఏడాది `గిల్టీ` నెట్ఫ్లిక్స్ ఫిల్మ్, `ఆంగ్రేజ్ మీడియం` చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ తో మెప్పించిన కియారా ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తుంది. అందులో `లక్ష్మీబాంబ్`, `ఇందూ కి జవానీ`, `షేర్షా`, `భూల్ భులైయ్యా 2`లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇందులో అక్షయ్ కుమార్తో మరోసారి కలిసి నటిస్తున్న `లక్ష్మీబాంబ్` చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగులో వచ్చిన `కాంచన`కిది రీమేక్.
మరోవైపు తెలుగులోని పలు ప్రాజెక్ట్ లకు కియారాతో చర్చలు జరుగుతున్నాయి. `ఆచార్య`లో రామ్ చరణ్కి జోడీగా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రంలో తారక్కి జోడీగా తీసుకోవాలనుకుంటున్నారనే ప్రచారంజరుగుతుంది.