ప్రియుడితో కలిసి బ్యాక్ అయిన కియారా.. ఫోటోలు హల్చల్.. పవన్తో రీఎంట్రీ కన్ఫమా?
కియారా అద్వానీ తన ప్రియుడు, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ప్రేమ పావురాలు మాల్దీవులకు వెళ్లాయి. అక్కడ రహస్యంగా రొమాన్స్ చేసుకున్న ఈ జోడీ ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎయిర్లో ఫోటోలకు చిక్కారు.
బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న కియారా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందట. దీంతో ఈ హాట్ సిల్వర్ స్క్రీన్ కపుల్, రియల్ లైఫ్లో ప్రేమలో పడ్డారట.
గత కొన్ని రోజులుగా కియారా, సిద్ధార్థ్ ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నట్టు వార్తలొచ్చాయి. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందుకు బలాన్నీ చేకూరుస్తూ ఈ ఇద్దరు చాలా సార్లు మీడియా కంటపడ్డారు.
అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇద్దరు ఏకాంతంగా కొత్త సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ దాదాపు ఐదు రోజులు ఎంజాయ్ చేశారు. చాలా ఏకాంతంగా గడిపారు. సరదాలు, ఎంజాయ్మెంట్లు పూర్తి చేసుకుని ముంబయి చేరుకున్నారు.
నీలి ద్వీపకల్పంలో బీచ్ సూట్లో బ్యాక్ నుంచి దిగిన ఫోటోని పంచుకుంది కియారా. అది తెగ వైరల్ అయ్యింది.
అనంతరం మరో బికినీ ఫోటోని పంచుకుంది. దీంతోపాటు సైకిల్పై బీచ్ వెంట చక్కర్లు కొట్టిందీ భామ. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సైకిల్పై బీచ్ వెంట చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులిచ్చిందీ సెక్సీ భామ.
తిరిగి ముంబయి చేరుకుంటున్న సందర్భంగా ఫోటోలకు చిక్కగా ఆయా ఫోటోలు సైతం ట్రోల్కి గురవుతున్నాయి. ఈ ఇద్దరిపై నెటిజన్లు రొమాంటిక్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరి ఈ రొమాంటిక్ జంట డేటింగ్ జర్నీ ఏ తీరం చేరుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా హిందీలో `షేర్షా`, `భూల్ భులైయ్యా 2`, `జగ్ జుగ్ జీయో` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుందట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కియారా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నారు. దీన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారాని అనుకుంటున్నారట. అంతేకాదు ఆమె ఫైనల్ అయ్యిందని సమాచారం. ఇందులో నిజమెంతా అనేది చూడాలి.