- Home
- Entertainment
- కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఆ ప్యాలెస్లో గ్రాండ్గా మ్యారేజ్..?
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఆ ప్యాలెస్లో గ్రాండ్గా మ్యారేజ్..?
బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం.

సినిమా పరిశ్రమ.. వరుసగా ప్రేమలు, పెళ్లిళ్లలో కళకళలాడుతుంది. ఈ ఏడాది నయనతార-విఘ్నేష్, రణ్బీర్ కపూర్-అలియా, ప్రణిత సుభాష్, హన్సిక మోత్వానీ, ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ మ్యారేజ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని మ్యారేజ్లు జరగబోతున్నాయి. లేటెస్ట్ గా నరేష్-పవిత్ర వంటి సీనియర్ జోడీ ఒక్కటి కాబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్లో క్రేజీ ప్రేమ జంటగా నిలుస్తున్న కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) సైతం ఒక్కటి కాబోతున్నారు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి చాలా రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. సీక్రెట్గా ప్రేమ పాఠాలు చెప్పుకుంటున్నారు. వెకేషన్లోనూ కలిసే వెళ్తూ మరింత హాట్ టాపిక్ అవుతున్నారు. మీడియాకి, సోషల్ మీడియాకి కావాల్సిన కంటెంట్ని ఇస్తున్నారు. అయితే వీరిద్దరు తమ ప్రేమపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ ప్రేమలో ఉన్నారనే విషయం మాత్రం చాలా సందర్భాల్లో కన్ఫమ్ అవుతూ వస్తుంది.
ఇదిలా ఉంటే ఆ మధ్య వీరిద్దరు బ్రేకప్ చెబుతున్నారనే వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని తెలుస్తుంది. అంతేకాదు పెళ్లికి రెడీ అయిపోయారని టాక్. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సమాచారం మేరకు ఫిబ్రవరిలో కియారా సిద్ధార్థ్ మల్హోత్రా ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట. ఫిబ్రవరి 6న వీరిద్దరి మ్యారేజ్కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అంతేకాదు రాజస్థాన్లోని ప్రముఖ ప్యాలెస్ జైసల్మేర్ ప్యాలెస్ హోటల్లో వీరిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని సమాచారం. గ్రాండ్ స్కేల్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి గతేడాది `షేర్షా` చిత్రంలో నటించారు. బయోగ్రాఫికల్ వార్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో కియారా, సిద్ధార్థ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ఈ జంట క్లోజ్ గా మూవ్ అయిన తీరుని బట్టే ప్రేమలో ఉన్నారనే పుకారు స్టార్ట్ అయ్యింది. అది పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా మ్యారేజ్ వరకు వెళ్లారని తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది.
కియారా అద్వానీ తెలుగు ఆడియెన్స్ కి చాలా చుపరిచితురాలు. మహేష్తో `భరత్ అనే నేను` చిత్రంలో నటించి టాలీవుడ్ చూపుని ఆకర్షించింది. ఆ తర్వాత రామ్చరణ్తో `వినయ విధేయ రామ`లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చరణ్తోనే `ఆర్సీ15`లో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా `మిషన్ మజ్ను`, `యోధ` చిత్రాల్లో నటిస్తుంది. `మిషన్ మజ్ను`తోనే రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.