- Home
- Entertainment
- Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్ ఇదే.. సింపుల్గా తేల్చేసిన హీరోయిన్
Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్ ఇదే.. సింపుల్గా తేల్చేసిన హీరోయిన్
సీనియర్ హీరోయిన్, ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన నటి ఖుష్బూ.. నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై స్పందించింది. ఆమె క్రేజీగా రియాక్ట్ అయ్యింది.

జబర్దస్త్ షోతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన ఖుష్బూ
ఖుష్బూ సుందర్.. ఓ వైపు సెలక్టీవ్గా సినిమాలు చేస్తూనే, మరోవైపు తెలుగులో జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గానూ చేస్తుంది. హీరోయిన్గా కంటే ఇప్పుడు టీవీ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన ఈ సీనియర్ నటి తన జీవితంలోని ఒక ఆసక్తికర విషయంపై స్పందించింది. తనపై వచ్చిన రూమర్లకి క్లారిటీ ఇచ్చింది. సింపుల్గా అసలు విషయాన్ని తేల్చేసింది.

దర్శకుడు సుందర్ సి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఖుష్బూ
ఖుష్బూ.. నటుడు, దర్శకుడు సుందర్ సిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు `మురై మామన్` అనే సినిమా షూటింగ్ టైమ్లో ప్రేమలో పడ్డారు. నిజానికి ఈ మూవీలో మొదట హీరోయిన్గా సౌందర్యని అనుకున్నాడు సుందర్ సి. ఆయనకిది దర్శకుడిగా ఫస్ట్ మూవీ. సౌందర్య అయితే బాగుంటుందనుకున్నారు. ఆ తర్వాత మీనా వద్దకు వెళ్లారు. ఆమె బిజీగా ఉండటం వల్ల ఖుష్బూని తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
ప్రభుతో ఖుష్బూ మ్యారేజ్ వార్తలు
కానీ అప్పట్లో ప్రభుతో ఖుష్బూ విషయంలో రూమర్స్ వచ్చాయి. అప్పట్లో నటుడు ప్రభు కూడా హీరోగా రాణించారు. మంచి సినిమాలు చేశారు. ప్రభుతో కలిసి చాలా సినిమాలు చేసింది ఖుష్బూ. వీరు హిట్ పెయిర్గా నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని కూడా రాశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఖుష్బూ స్పందించింది. సుమన్ టీవీ నుంచి రోషన్ ఈ ప్రశ్నని ఖుష్బూని అడిగాడు, ఆ మధ్య ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న రాగా ఖుష్బూ క్రేజీగా స్పందించింది.
ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్ ఇదే
ప్రభుతో చాలా సినిమాలు చేశానని, మంచి విజయాలు అందుకున్నామని, తమది నైస్ పెయిర్ అని తెలిపింది ఖుష్బూ. సత్యరాజ్తో ఎక్కువ సినిమాలు చేశానని, కార్తీక్, తాను, అలాగే ప్రభు తాను కలిసి చాలా సినిమాలు చేశామని, నైస్ పెయిర్ అని చెప్పింది. కానీ చాలా మంది ఆడియెన్స్, తమ పేరెంట్స్ సైతం కమల్ సర్తో చేయడాన్ని బాగా ఇష్టపడతారని తెలిపింది. ఈ క్రమంలోనే రూమర్ల ప్రశ్న రావడంతో.. `ఇది చాలా పాత స్టోరీ, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఆయన లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు, మేం లైఫ్లో సెటిల్ అయ్యాం. మళ్లీ ఆ విషయాల ప్రస్తావన వద్దు` అని చెప్పేసింది ఖుష్బూ. ప్రభు తన భర్తతో కూడా కలిసి పనిచేశారని, వారంతా 80 గ్రూప్లో భాగమే అని తెలిపింది ఖుష్బూ. ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది.
ఖుష్బూ తెలుగులో చేసిన పాపులర్ మూవీస్
`కళియుగ పాండవులు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. ఆ తర్వాత `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `గురు శిష్యులు`, `పేకాట పాపారావు`, `స్టాలిన్`, `యమదొంగ`, `అజ్ఞాతవాసి`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`, `రామబాణం` వంటి చిత్రాల్లో నటించింది.

