ఇవన్నీ ప్రేమలేఖలే అట..బీచ్ కే అందం తీసుకొచ్చిన బ్రో హీరోయిన్, వైరల్ పిక్స్
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది.
ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు.
ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజ్ పెంచుకుంటూ వెళ్ళింది. యువతని అట్రాక్ట్ చేసే విధంగా ఫోజులు ఇచ్చింది.
2022లో కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు.
దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది.
తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది.
కేతిక శర్మ బీచ్ లో సముద్రపు అలలతో ఆటలాడుకుంటూ వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. పొట్టి బట్టల్లో యువతని ఆకర్షించేలా గ్లామర్ ప్రదర్శిస్తోంది. తన సొగసుతో బీచ్ కే అందం పెంచేసింది కేతిక.
అంతే కాదు కవిత్వం కూడా చెబుతోంది. సముద్రం .. ఒడ్డుకి రాసే ప్రేమ లేఖలే అలలు అంటూ కవిత్వం చెప్పింది. కేతిక గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా వైరల్ అవుతున్నాయి.