చూపించడంలో తెగించిన కీర్తిసురేష్.. పైట తీసేసి బిగువైన బ్లౌజ్లో టాప్ షో.. లెహంగా వోణీలో ఇంత హాట్గా ఉందో!
కీర్తిసురేష్ అంటే తనకంటూ కొన్ని లిమిటేషన్స్ తో ఉండే హీరోయిన్.. స్కిన్ షో విషయంలో ఆమె ప్రారంభం నుంచి చాలా స్టిక్ట్ గా ఉంది. కానీ ఈ మధ్య మాత్రం తన పద్దతులు పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. డోస్పెంచుతూ షాకిస్తుంది.
సౌత్లో `మహానటి`గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్.. తాజాగా అందాల డోస్ పెంచి ఆశ్చర్యపరిచింది. ముక్కు మీద వేలేసుకునేలా గ్లామర్ షో చేసింది. చాలీ చాలని బ్లౌజ్ ధరించింది కిర్రాక్ పోజులిచ్చింది. బిగువైన బ్లౌజ్లో ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.
లెహంగా వోణీలో అందాల విందు వడ్డించింది కీర్తిసురేష్. ఈ ఆదివారాన్ని చాలా స్పెషల్గా మార్చింది. నెవర్ బిఫోర్ కీర్తి అనేలా ఆమె అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో హాట్ కేక్లా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుండటం విశేషం.
తన ఫ్రెండ్ పెళ్లి కోసం ఇలా ముస్తాబైందట కీర్తి. ఫ్రెండ్ పెళ్లిలో దిగిన ఫోటోలంటూ ఆమె పోస్ట్ పెట్టింది. పెళ్లి సందర్భంగా ఫన్ అంటూ షేర్ చేసింది. కోల్కతా డైరీస్ అంటూ పేర్కొంది. కోల్కతాలో జరిగే ఫ్రెండ్ పెళ్లిలోని ఫోటోలని చెప్పిందీ బ్యూటీ. తాజాగా కీర్తి ఫోటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక ఇటీవల `దసరా` సినిమాతో బంపర్ హిట్ ని అందుకుంది కీర్తిసురేష్. `మహానటి` తర్వాత ఈ అమ్మడికి దక్కిన విజయం ఇదే. ఇన్నాళ్లు ఆమె చాలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కమర్షియల్ సినిమాలు చేసింది. కానీ ఏదీ ఆకట్టుకోలేకపోయింది.
మాలీవుడ్కి చెందిన ఈ భామ హీరోయిన్గా అక్కడే పరిచయమైంది. `నేను శైలజ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `రెమో`తో మరో సక్సెస్ కొట్టింది. నానితో చేసిన `నేను లోకల్` చిత్రం మంచి హిట్ అయ్యింది. `మహానటి` ఆమెని జాతీయ ఉత్తమ నటిని చేసింది. ఇప్పుడు `దసరా` హిట్ అయ్యింది.
ఇప్పటి వరకు కీర్తి సురేష్ మలయాళంతోపాటు తమిళం, తెలుగులో నటించింది. కోలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసింది. కానీ తెలుగులో ఎక్కువ విజయాలు అందుకుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో `దసరా`తో హిట్ దక్కింది. ఇప్పుడు చిరంజీవితో `భోళా శంకర్`లో ఆయనకు చెల్లిగా చేసింది. కొత్తగా మరే తెలుగు సినిమాకి ఈ బ్యూటీ సైన్ చేయలేదు.
కానీ తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. అక్కడ ఇప్పుడు `మామన్నన్`, `సిరెన్`, `రఘు తాత`, `రివాల్వర్ రీటా` చిత్రాలు చేస్తుంది. దీంతో టాలీవుడ్కి కీర్తి గుడ్ బై చెప్పినట్టేనా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగులో అన్నిసార్లు పాత్రకు ప్రయారిటీ ఉన్న సినిమాలు దక్కడం కష్టం. అందుకే ఈ బ్యూటీ తమిళంకి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది.