MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ

500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్డెట్ తో తీసిన, కంటెంట్ ఏంటే చాలు, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మూడేళ్లుగా ఓటీటీని ఏలుతున్న ఆమూవీ ఏదంటే?

2 Min read
Mahesh Jujjuri
Published : Sep 05 2025, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Hombale Films

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది ఓ చిన్న సినిమా. ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. ఆ సినిమా మరేదో కాదు ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ కన్నడ చిత్రం, దేశ వ్యాప్తంగా అద్భుతం చేసింది.

25
Image Credit : stockPhoto

కేవలం 14 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా రచ్చ రచ్చ చేస్తోంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అయిన కాంతారా గత మూడు సంవత్సరాలుగా ట్రెండ్ అవుతోంది. దీనివల్ల ఇది ఓటీటీ హిస్టరీలో మైలురాయిగా నిలిచింది.

Related Articles

Related image1
సమంత ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదా? స్టార్ హీరోయిన్ మొదటి ప్రేమ ఎవరితోనో తెలుసా?
Related image2
అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?
35
Image Credit : our own

కాంతార సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ గా రిషబ్ శెట్టికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చలువే గౌడ ఈ సినిమాను నిర్మించారు. కథలోని దేవతా సంప్రదాయాలను, భక్తి , ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యేకమైన తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

45
Image Credit : Google

కాంతార 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి అవార్డు పొందగా, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మరో అవార్డు లభించింది.ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే ‘కాంతార’ కథకు ముందు ఏం జరిగింది అనేది సినిమాగా తీసుకురాబోతున్నారు రుషబ్ శెట్టి.

55
Image Credit : Google

ఈ సినిమా వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. కాంతార ప్రీక్వెల్ ను అక్టోబర్ 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు టీమ్. ఇందులో ‘దైవిక సంప్రదాయం ఎలా ప్రారంభమైంది?’ అనే అంశాన్ని వివరించనున్నారు. ఈ ప్రీక్వెల్‌లో కూడా రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అతనితో పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved