- Home
- Entertainment
- Kangana Ranaut: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్.. మంచు విష్ణుకి కృతజ్ఞతలు
Kangana Ranaut: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్.. మంచు విష్ణుకి కృతజ్ఞతలు
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.
కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు.
ఇటీవల కంగనా రనౌత్ ఎక్కువగా గుడులు గోపురాల చుట్టూ తిరుగుతోంది. కంగనా రనౌత్ కొన్ని నెలల క్రితం తిరుమల శ్రీవారిని అలాగే శ్రీకాళహస్తిని సందర్శించింది. ఇప్పుడు కంగనా మరోసారి తిరుమల సందర్శించింది.
సాంప్రదాయ చీరకట్టులో కంగనా రనౌత్ శ్రీవారి ఆలయం ఎదుట కనిపించింది. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
కంగనా రనౌత్ నటించిన ధాకాడ్ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలతో కలసి కంగనా తిరుమలలో సందడి చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసిన మంచు విష్ణుకి కంగనా రనౌత్ కృతజ్ఞతలు తెలిపింది.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు గిట్టని వారు చాలా మందే ఉన్నారు. కొందరి పేర్లు వింటేనే కంగనా కోపంతో రగిలిపోతుంది. ఇక మీడియా ముందు కూడా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. కంగనా రనౌత్ ప్రస్తుతం లాక్ అప్ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.