`కల్కి2898ఏడీ` నుంచి ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. కానీ రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు ఓ కొత్త డేట్ తెరపైకి వచ్చింది.
ప్రభాస్ నుంచి ఇప్పుడు `కల్కి 2898 ఏడీ` సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్తో, భారీ స్కేల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. భారీ కాస్టింగ్ కూడా ఇందులో ఉంది. ఇలా అన్ని రకాలుగా ఈ మూవీ పెద్ద సినిమాగా నిలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం చాలా కాలంగా వెంటాడుతున్న ప్రశ్న.
టీమ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కనీసం అప్డేట్లు కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇదిలా ఉంటే ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.సినిమా షూటింగ్ పూర్తయిందనే వార్తని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ప్యాకప్ అంటూ పేర్కొన్నాడు. ఇందులో ఓ ఫన్నీ డైలాగ్లను షేర్ చేసుకున్నారు.
ప్రభాస్ కటౌట్కి బ్యాక్ గ్రౌండ్లో జాకెట్పై నాగ్ అశ్విన్ ఫోటో, కల్కిలో ప్రభాస్ లుక్ని పెట్టి.. `ప్యాక్ అప్.. నైస్ బట్ వన్ లాస్ట్ టేక్` అని నాగ్ అశ్విన్ అంటున్నట్టుగా ఓ డైలాగ్ ఉంటే, కింద `నాయాల్ది కత్తి అందుకో జానకి` అని కోపంతో ప్రభాస్ చెబుతున్నట్టుగా ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇదిలా ఉంటే `కల్కి2898ఏడీ` ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. ఈ విషయంలో `బాహుబలి`ని మించిపోవడం విశేషం. `బాహుబలి` కోసం రాజమౌళి 896రోజులు తీసుకున్నాడు. కానీ `కల్కి2898ఏడీ`కోసం నాగ్ అశ్విన్ ఏకంగా 991రోజులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ వంద రోజులు ఎక్కువ చిత్రీకరణ జరుపుకుంది.
ఇక ఈ మూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు. మే 9ని టీమ్ ప్రకటించింది. కానీ వాయిదా పడుతుందంటూ ప్రచారం మొదలైంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నారట. మరి కొత్త డేట్ ఎప్పుడు అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త డేట్ వినిపిస్తుంది. మే 30న రాబోతుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి.కానీ ఆ డేట్ కి కూడా కష్టమే అట. దీంతో జూన్కి వెళ్తున్నట్టు టాక్. జూన్ 20 రిలీజ్ డేట్ అనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తోపాటు దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ది గెస్ట్ రోల్ అని తెలుస్తుంది. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, వర్మ వంటి వారు కూడా కనిపిస్తారట. వైజయంతి మూవీస్ దీన్ని సుమారు 500కోట్లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.