కాజల్ ధరించిన లెహెంగా ఎంత స్పెషలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లు వివాహం రెండు రోజుల క్రితం ముంబయిలో గ్రాండ్గా జరిగింది. ఓ స్టార్ హోటల్ వీరి పెళ్ళికి వేదికైంది. నార్త్ ట్రెడిషనల్తోపాటు సౌత్ సంప్రాదాయల మేళవింపుగానూ వీరి వివాహ వేడుక జరిగింది.
దక్షిణ సంప్రదాయం ప్రకారం జిలకర బెల్లం పెట్టుకున్నారు కాజల్, కిచ్లు. వీరిద్దరికి సౌత్ ట్రెడిషనల్ మీదున్న మక్కువతో ఇవి పాటించినట్టు కాజల్ పేర్కొంది. కాజల్ పంజాబీ అమ్మాయిని, గౌతమ్ కాశ్మీర్ అబ్బాయి. అయినా వీరిద్దరు సౌత్ ట్రెడిషన్ని ఫాలో అయ్యారు.
ఇదిలా తాజాగా కాజల్ తన పెళ్ళికి ముస్తాబైన ఫోటోలను పంచుకుంది. మ్యారేజ్లో కాజల్ భారీ ఎంబ్రాడయరీ లెహంగాలో మెరిశారు. జైపూర్ నుంచి తెప్పించిన ఆభరణాలతో కాజల్ను ముస్తాబు చేశారు. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారు.
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ ఇప్పుడు ఓ ఇంటికి కోడలయ్యారు. ఫ్యామిలీ లైఫ్లోకి అడుగుపెట్టారు. అయితే పెళ్ళిలో ఆమె ధరించిన గులాబి రంగు లెహెంగా గురించి తెలిసి ఆమె అభిమానులు షాక్కి గురవుతున్నారు. దీన్ని తయారు చేసిన అనామికా ఖన్నా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. కాజల్ కోసం ఈ లెహెంగాని ఎంతో ప్రేమతో డిజైన్ చేసినట్టు చెప్పారు.
ఫ్లోరల్ డిజైన్లో జర్దోసి వర్క్ వేయడానికి 20 మంది దాదాపు నెల రోజులపాటు శ్రమించారట. దీని విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. గతంలో అనామిక.. మిహీకా బజాజ్, సోనమ్ కపూర్, మీరా కపూర్ వంటి వారి మ్యారేజ్ లెహెంగాలను డిజైన్ చేశారు. చాలా పాపులర్ అయ్యారు.
దీంతోపాటు తాళికట్టే సమయంలో సునీతా షెకావత్ తయారు చేసిన అభరణాలు ధరించారు కాజల్. ఇందులో ఆకుపట్ట రాళ్లని పొదిగారు. తన తలకు పెట్టుకున్న మాతా పట్టి ప్రత్యేక ఎట్రాక్షన్ అయ్యింది.
ఇక గౌతమ్ కిచ్లు ధరించిన తెలుగు రంగు షెర్వాణీ విలువ లక్షా 15వేలు అని తెలుస్తుంది. దీన్ని అనితా డోంగ్రే డిజైన్ చేశారు. మెహందీ ఫంక్షన్లో కాజల్ ఆకుపచ్చ కుర్తాలో కనిపించారు. దీని విలువ 25వేళు అని సమాచారం. మొత్తానికి తన పెళ్లికి సంబంధించిన కాజల్ అన్ని ప్రత్యేకంగా ఉండేలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు కరోనా ప్రభావం ఉండటంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మ్యారేజ్కి హాజరయ్యే వారందరికి కరోనా టెస్టులు చేసినట్టు తెలిపారు.
కాజల్ వీలైనంత త్వరగా హనీమూన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారట. త్వరలో ఆమె షూటింగ్ల్లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేయాల్సి ఉంది. అందుకే ఈ లోపే హనీమూన్కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే కాజల్-గౌతమ్ కిచ్లుల రిసెప్షన్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.