సముద్రం మధ్యలో డిన్నర్, అక్వేరియం మ్యూజియంలో శోభనం...కాజల్ హనీమూన్ డిటైల్స్ తెలిస్తే షాకే
కొంత జంట కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు హద్దులు లేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అక్టోబర్ 30న వివాహం చేసుకున్న ఈ జంట వారం వ్యవధిలో హానీమూన్ కి వెళ్లారు.
కొంత జంట కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు హద్దులు లేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అక్టోబర్ 30న వివాహం చేసుకున్న ఈ జంట వారం వ్యవధిలో హానీమూన్ కి వెళ్లారు.
దాదాపు 20రోజులుగా మాల్దీవ్స్ లో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అత్యంత ఖరీదైన హానీమూన్ వెకేషన్ జరుపుకుంటున్నారు ఈ జంట.
ఖరీదైన హోటల్స్, వెకేషన్ స్పాట్స్ ఎంపిక చేసుకున్న వీరిద్దరూ, ప్రతి విషయంలో లగ్జరియస్ గా ఆలోచిస్తున్నారు. కాజల్ తన హనీ మూన్ డ్రెస్ కోసమే వేలల్లో ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ట్రాన్స్పరెంట్ రెడ్ బ్యాక్ లెస్ వేర్ ధరించిన కాజల్, ఆ డ్రెస్ కోసం ఏకంగా రూ. 13 వేలు ఖర్చుపెట్టిందట. ఇక సముద్రం మధ్యలో డిన్నర్లు, అక్వేరియం మ్యూజియంలో శోభనం జరుపుకున్నారు.
జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుపుకునే హనీమూన్ వెకేషన్ ని కాజల్ ఖర్చుకు వెనకాడకుండా భారీగా జరుపుకుంటుంది. మూడు వారాల హనీమూన్ వెకేషన్ అంటే మాటలా మరి.
స్టార్ హీరోయిన్ గా కోట్లు సంపాదన కలిగిన కాజల్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం పెద్ద విశేషం కాదు అనుకోవాలి. దశాబ్దానికి పైగా హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్, ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. .
వాటిలో ఆచార్య, భారతీయుడు2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ఆచార్య షూటింగ్ తిరిగి మొదలు కాగా, త్వరలో కాజల్ జాయిన్ కానున్నారు.
ఇక భారతీయుడు2 మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు మూవీలో కూడా కాజల్ ప్రధాన పాత్ర చేస్తున్నారు.
అటు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సక్సెస్ ఫుల్ లైఫ్ ని అనుభవిస్తుంది కాజల్.