మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లకి ట్రై చేశా.. రహస్యాలు బయటపెట్టిన జేడీ చక్రవర్తి
జేడీ చక్రవర్తి హీరోగా, విలన్గా మెప్పించిన ఆయన ఇప్పుడు చాలా సెలక్టీవ్గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఓం కార్ షోలో పాల్గొన్న ఆయన హీరోయిన్లకి సంబంధించిన ఓ రహస్యం బయటపెట్టారు.
జేడీ చక్రవర్తి తనకంటూ ఓ ప్రత్యేకతని క్రియేట్ చేసుకున్న నటుడు. విభిన్నమైన సినిమాలతో ఆడియెన్స్ ని అలరించారు. `మనీ మనీ`, `గులాబీ`, `బొంబాయి ప్రియుడు`, `ఎగిరే పావురమా`, `హోమం`, `ప్రేమకు వేళయేరా`, `సత్య`(హిందీ) వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. హీరోగా మెప్పించారు. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా విభిన్న పాత్రలు పోషించి నటుడిగా మెప్పించారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా సెలక్టీవ్గా చేస్తున్నారు.
ప్రస్తుతం హాట్ స్టార్లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఈషా రెబ్బా కూడా ఇందులో నటించబోతుంది. త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ జంట ఓంకార్ యాంకర్గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోలో పాల్గొన్నారు. ఈషా రెబ్బాతో కలిసి జేడీ చక్రవర్తి పాల్గొని సందడి చేశాడు. తనదైన పంచ్లతో నవ్వులు పూయించాడు. ఈషాతో కలిసి షోలో కాసేపు రచ్చరచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
ఈ షోలో ఓ బోల్డ్ కామెంట్ చేశారు జేడీ చక్రవర్తి. ఇందులో ఓంకార్ఓ క్రేజీ ప్రశ్న సందించారు. మీరు మీకెరీర్లో ఏ హీరోయిన్నైనా, ఎప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా? అని ప్రశ్నించాడు. దీనికి జేడీ చక్రవర్తి అంతే బోల్డ్ గా, అంతే ఫన్నీగా సమాధానం చెప్పారు. `మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా` అని వెల్లడించారు. దీంతో షోలో నవ్వులు చిందించాయి. ప్రోమోలో ఇది హైలైట్గా నిలిచింది. దీంతోపాటు ఈషా రెబ్బాతో కలిసి ఆయన చేసిన రచ్చ నవ్వులు పూయించింది.
జేడీ చక్రవర్తి ఎక్కువగా మహేశ్వరితో సినిమాలు చేశారు. `గులాబీ`, `మృగం`, `దెయ్యం`లు వీరి కాంబినేషన్లో వచ్చాయి. `బొంబాయి ప్రియుడు`లో రంభతో, `ఎగిరే పావురం`లో లైలాతో, అలాగే సౌందర్య, ఉర్మిలా, మీనా, రాశీ, లయ, సాక్షి శివానంద్ ఇలా చాలా మంది టాప్ హీరోయిన్లతో చేశాడు జేడీ చక్రవర్తి. అయితే అప్పట్లో మంచి రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన ఎక్కువగా థ్రిల్లర్ తరహా సినిమాలే చేసినా, కొన్ని లవ్ స్టోరీస్ కూడా చేసి మెప్పించాడు. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జేడీ.. చివరగా 2022లో 'కారీ' మూవీలో కనిపించారు. హిందీలో ఈ ఏడాదిలో వచ్చిన 'తాజా ఖబర్' అనే వెబ్ సీరీస్ లోనూ జేడీ చక్రవర్తి నటించారు.
ఇదిలా ఉంటే జేడీ చక్రవర్తికి ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా ప్రతిష్టాత్మకంగా భావించే ఎతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయనకు అవార్డు దక్కింది. గతేడాది ఆయన నటించిన `దహిణి ది విచ్` అనే సినిమాలోని నటనకు గానూఉత్తమ సహాయ నటుడిగా జేడీ చక్రవర్తికి అవార్డు దక్కడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే సుమారు 18 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.