- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి, వసు లకు సలహాలు ఇచ్చిన జయచంద్ర.. ధరణి మాటలకు భయపడిన దేవయాని?
Guppedantha Manasu: రిషి, వసు లకు సలహాలు ఇచ్చిన జయచంద్ర.. ధరణి మాటలకు భయపడిన దేవయాని?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు గదికి వెళ్ళగా ఈసారి మళ్లీ వచ్చారు అనగా ఏ రాకూడదా అనడంతో మళ్లీ రావడానికి మళ్లీ ఏదో కారణం ఉందో ఉంటుంది ప్రతిసారి ఉంటుంది. కారణాలు చెప్తే కానీ లోపలికి రానివ్వవా అని అంటాడు రిషి. మళ్లీ థాంక్స్ చెప్పడానికి వచ్చారా సార్ అనగా రెండోసారి థాంక్స్ చెప్పించుకునే అలవాటు నీకు ఏమైనా ఉందా అని అంటాడు రిషి. అని చెప్తారు కానీ ఎందుకు వచ్చాడో చెప్పడు అని వసుధార మనసులో అనుకుంటూ ఉండగా ఇందాక థాంక్స్ చెప్పాను కదా అది తీసుకోవడానికి వచ్చాను అని వసుధారకి దగ్గరగా వెళుతుండగా వసుధార ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అప్పుడు పక్కనే బెడ్ పై పిల్లో, బెడ్ షీట్ తీసుకోవడంతో దీని కోసమే వచ్చాను అని అంటూ అందుకోసం వచ్చారా అని అనిపింది వసుధార. ఇంతలో ధరణి అక్కడికి వచ్చి ఇక్కడే పడుకుంటావ రిషి నేను కావాలంటే బయట పడుకుంటాను అనడంతో వద్దులే వదిన నా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు నేను పైకి వెళ్లి టెర్రస్ పై పడుకుంటాను చల్లగాలి కావాలి అని అంటాడు. ఆ తర్వాత పడుకోవడానికి వెళుతుండగా చూసావా మహేంద్ర నువ్వు ఏదేదో అనుకున్నావు అని అంటుంది జగతి. అప్పుడు రిషి పడుకుని ఉండగా చందమామ వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
అప్పుడు చందమామలో వసుధార కనిపించడంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి పడుకోవడంతో వసుధార అక్కడికి వస్తుంది. ఇంతలో రిషి నిద్ర లేచి ఏంటి వసుధార ఇక్కడికి వచ్చావు అని అంటాడు. ఇంతవరకు చందమామలో కనిపించావు అప్పుడే ఇక్కడికి వచ్చావు అనడంతో నిజంగానే కనిపించాలా సార్ అనగా చందమామలో అలా చూస్తూ ఎప్పుడు నిద్రపోయారో నాకే తెలియదు అని అంటాడు రిషి. అప్పుడు వసు మన మధ్య ఉన్న దూరం గురించి జయచంద్ర గారికి తెలియకూడదని ఇలా చేస్తున్నారు కదా సార్ అని అంటుంది.
నా దృష్టి అంతా ఎప్పుడూ కూడా సమస్య మీదే ఉంటుంది ఒకరిని భ్రమ పెట్టడం నా ఉద్దేశం కాదు అని అంటాడు రిషి. అవును నువ్వు నిద్ర పోలేదా అనగా మీరు నిద్రపోయారో లేదో చూద్దామని వచ్చాను సార్ అంటుంది. కొత్త రూం కదా సార్ తొందరగా నిద్ర పట్టడం లేదు అనడంతో కళ్ళు మూసుకొని పడుకో అదే నిద్ర పడుతుంది అనగా మీరు చందమామ వైపు అలాగే చూస్తూ ఉండండి సార్ అని అంటుంది. మార్నింగ్ తొందరగా వచ్చి నిద్ర లేపు అని అంటాడు రిషి. ఆ తర్వాత జయచంద్ర ఉదయాన్నే ధ్యానం చేస్తుండగా ఇంతలో వసుధార అక్కడికి టీ తీసుకొని వస్తుంది. అప్పుడు జయచంద్ర నీలో ఏదో అలజడి కనిపిస్తోంది అలజడి వల్ల ప్రశాంతత ఉండదు మనశ్శాంతి తెచ్చుకోమ్మ అని అంటాడు.
ఇంతలో అక్కడికి రావడంతో ఇద్దరి అభిరుచులు వేరై ఉండవచ్చు మనసుకు వేరై ఉండవచ్చు కానీ అభిప్రాయాలు మాత్రం ఒకటే అని అంటాడు జయచంద్ర. అప్పుడు జయచంద్ర రిషి,వసు లకు సలహాలు ఇస్తూ ఉంటాడు జయచంద్ర. ఆ తర్వాత ధరణిని పిలవగా చెప్పండి అత్తయ్య అనడంతో ఇతను ఏం చేస్తున్నావు అతిథిగం ఎవరు మర్యాదలు చేస్తున్నారు అనగా వసుధార చేస్తోంది అని అంటుంది ధరణి. ఓహో నన్ను ఇందుకోసం పిలిచారా అత్తయ్య అంటూ కొద్దిసేపు తింగరి తింగరిగా మాట్లాడే దేవయానికి కోపం తెప్పిస్తుంది. ఇంతలోనే అక్కడికి జయచంద్ర వస్తారు. ఇప్పుడు రిషి ఎక్కడికి వచ్చి ఏంటి పెద్దమ్మ టెన్షన్ గా ఉన్నారు. ఒంట్లో బాగోలేదా ఆడడంతో అదేం లేదు నాన్న అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు దేవయానికి టెన్షన్ పడుతుండగా ధరణి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరు కలిసి కాలేజీకి బయలుదేరుతారు. అప్పుడు వసుధార, రిషి ఇద్దరు కాలేజీ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రతిసారి వసుధార సార్ అని పిలవడంతో తెలుగింటి ఆడపిల్లలు ఎవరూ కూడా భర్తని సార్ అని పిలవరు కదా అని అంటాడు జయచంద్ర. అప్పుడు వాళ్ళిద్దరికీ మరిన్ని మంచి మాటలు చెబుతూ ఉంటాడు జయచంద్ర. ఆ తరువాత జయచంద్ర లైబ్రరీలో రాసుకుంటూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఏదో విషయం చెప్పాలని ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అప్పుడు ఏ విషయమైనా ఇబ్బంది పడకుండా నిర్మొహమాటంగా చెప్పండమ్మా అని అంటాడు. అప్పుడు జగతి కూర్చుని ఈ కాలేజీ ఎండి రిషి నా కొడుకు అన్న విషయం మీకు తెలుసు కదా సార్. వసు,రిషి ఇద్దరు భార్యాభర్తలు చాలా మంచివాళ్లు. ఎదుటి వ్యక్తులను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్లు కలవలేక పోతున్నారు సార్ అని అంటుంది జగతి. వాళ్లిద్దరూ పక్కపక్కనే ఉన్న కలిసి ఉండలేకపోతున్నారు సార్ అని బాధగా మాట్లాడుతుంది జగతి.