ఇమ్మాన్యుయెల్కి ఛార్జింగ్ పెట్టిస్తానంటోన్న వర్ష.. ఆలీ మైండ్ బ్లాంక్ చేసిన పాలకొల్లు భామ..
`జబర్దస్త్` ఫేమ్ ఇమ్మాన్యుయెల్.. శ్రీదేవిగా మారిపోయాడు. ఆలీ ముందే హోయలు పోయాడు. మరోవైపు `జబర్దస్త్` వర్ష.. నరేష్ని బాడీగార్గ్ గా పెట్టుకుంది. పైగా అతడు తన తమ్ముడట. అతనిలో కరెంట్ ఉందని, ఇమ్మాన్యుయెల్కి ఛార్జింగ్ పెడతానని అంటోంది. మరి ఆ కథేంటో చూస్తే..
ఈటీవీలో ప్రతి ఏడాది `శ్రీదేవి డ్రామా కంపెనీ` అనే ఓ స్పెషల్ షోలో రన్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఇమ్మాన్యుయెల్, వర్ష, నరేష్ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఇమ్మాన్యుయెల్, అలీ మధ్య వచ్చే సీన్స్, అలాగే పాలకొల్లు భామ చాందికి ఫిదా అయిన అలీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
షో ప్రారంభంలో గెస్ట్ అయిన ఆలీ ఎంట్రీ ఇవ్వడంతో `మీ ఎంట్రీతో హాల్ మొత్తం నిండిపోయిందని ఇమ్మాన్యుయెల్ అనగా, నువ్వు మొదలు పెట్టకు, హాట్ ఖాళీ అయిపోతుందని పంచ్ వేశాడు. దీంతో ఇమ్మాన్యుయెల్కి దిమ్మ దిరిగిపోయింది. ఆ వెంటనే రాకెట్ రాఘవ వచ్చి `సర్ ఏం తెప్పించమంటారు అనగా, `కాస్త నవ్వు తెప్పించండి` అని అలీ కామెంట్ చేయడం నవ్వులు పూయించింది.
అనంతరం శ్రీదేవి ఎక్కడ అని అలీ అడగ్గానే, `సిరిమల్లె పువ్వా..` అంటూ ఇమ్మాన్యుయెల్ పాటు పాడుకుంటూ అలీ దగ్గరికి రావడం, నేనే శ్రీదేవి అనడం వంటి సీన్లు నవ్వులు పూయించాయి.
వర్ష, నరేష్, ఇమ్మాన్యుయెల్ మధ్య వచ్చే సీన్లు ఆద్యంతం నవ్వులు పూయించాయి. వర్షకి బాడీగార్గ్ గా వస్తాడు నరేష్. `అరే మీకో విషయం తెలుసా. మా తమ్ముడిలో కరెంట్ ఉంది. మా చుట్టుప్రక్కల ఎవరింట్లో అయినా కరెంట్ పోయిందనుకో..ఛార్జింగ్ కోసం మా తమ్ముడి వద్దకే వస్తారు` అని వర్ష చెప్పింది.
దీనికి ఇమ్మాన్యుయెల్ స్పందిస్తూ నరేష్ వైపు తదేకంగా చూస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావని నరేష్ అడగ్గా..
`అదే ఛార్జింగ్ ఎక్కడ పెడతారా అని` అనడం హాస్యాన్ని పండించింది.
మరోవైపు హ్యుమన్ కంప్యూటర్ భాను భాస్కర్ వచ్చి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు, లెక్కలకు సమాధానం చెప్పి అందరిచేత వాహ్ అనిపించుకున్నాడు.
దీంతోపాటు చివర్లో పాలకొల్లు భామ చాందిని ఓ ఐటెమ్ సాంగ్లో కిర్రాక్పుట్టించే డాన్స్ తో అందరిని షేక్ చేసింది. ఆమె దెబ్బకి ఆలీకి కూడా మతిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ చివర్లో షోని మరింత రంజుగా మార్చింది.
ఆమె దెబ్బకి ఆలీకి కూడా మతిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ చివర్లో షోని మరింత రంజుగా మార్చింది.
ఎప్పటిలాగే వర్ష తనదైన పంచ్లతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకిది ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్ కాంబినేషన్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి ఏ షో చేసినా హైలైట్ అవుతుంది.