తనలోని మరో టాలెంట్ని బయటపెట్టిన `జబర్దస్త్` రష్మీ.. హాట్ యాంకర్కి సంగీత ప్రశంసలు
`జబర్దస్త్` యాంకర్ రష్మీ యాంకరింగ్గా షోలను ఉర్రూతలూగిస్తుంది. ఆయా షోల సక్సెస్లో రష్మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు సింగర్స్ కి పోటీ ఇవ్వబోతుంది రష్మీ. అద్భుతమైన పాట పాడి ఆకట్టుకుంది.
రష్మీ గౌతమ్ యాంకర్గా ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. `జబర్దస్త్`, `ఢీ` షోలో ఈ హాట్ అందాల బ్యూటీ సందడి అంతా ఇంతా కాదు.
ఈ షోలను చూసే వారు సగానికిపైగా రష్మీ కోసం, ఆమెనవ్వులు, ఆమె మాటల, స్టేజ్పై ఒంపుసొంపుల కోసం చూస్తారనేది వాస్తవం. అంతగా హంగామా చేస్తుంది.
రష్మీ యాంకర్గానే కాదు నటిగా తానేంటో నిరూపించుకుంటోంది. ఇప్పటికే `గుంటూరు టాకీస్` వంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. తెరపై కనువిందు చేసింది. ఇప్పుడు `బొమ్మ బ్లాక్బస్టర్` చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే చూడబోతే ఇప్పుడు రష్మీ సింగర్గానూ తనసత్తా చాటబోతుందని అర్థమవుతుంది. తాజాగా జీ తెలుగులో ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న `ఆషాడంలో ఆత్తకోడళ్లు` అనే ఓ స్పెషల్ ఈవెంట్లో రష్మీ సందడి చేసింది.
ఇందులో స్టేజ్పై పాట పాడింది. వర్షంపై `మెరిసింది మేఘా మేఘా..`అంటూ అద్బుతంగా పాట పాడింది రష్మీ. ఈ పాట సినిమాలోని రియల్ సింగర్ పాడినట్టుగానే ఉండటం విశేషం.
ఆమె పాటకి నటి సంగీత కూడా ఫిదా అయ్యారు. `అబ్బబ్బబ్బ.. ఇలాంటి మంచి సింగింగ్ నెవ్వర్ బిఫోర్..నెవ్వర్ ఆఫ్టర్..`అని చెప్పడం ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ బాగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. రష్మీ సింగింగ్ టాలెంట్పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంది. సింగర్స్ కి మరో పోటీ తప్పదంటూ కామెంట్ చేస్తుండటం విశేషం.