Nagababu: ఏళ్లుగా గుండెల్లో రగులుతున్న పగ... నాగబాబు రివేంజ్ తీరే సమయం వచ్చింది!
ప్రత్యర్థులు బలహీనపడినప్పుడు శత్రువులకు యుద్ధం తేలికవుతుంది. సులభంగా విజయం సాధించే వీలు కలుగుతుంది. యుద్ధం గెలవాలంటే మన శత్రువును బలహీనపర్చాలి. లేదా వారే స్వయంగా బలహీనపడే వరకు ఎదురు చూడాలి.

Nagababu
జబర్దస్త్ షోపై గత మూడేళ్ళుగా యుద్ధం చేస్తున్న నాగబాబు(Nagababu), వాళ్ళను తొక్కేసి ధీటుగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆరెంజ్ మూవీ నిర్మాతగా అన్నీ కోల్పోయిన నాగబాబుకు జబర్దస్త్ రూపంలో ఆశాకిరణం ఎదురైంది. మల్లెమాల ప్రొడక్షన్ లో మొదలైన కామెడీ షోకి జడ్జిగా నాగబాబును ఎంచుకున్నారు. మరొక జడ్జిగా నటి రోజా ఛాన్స్ దక్కించుకున్నారు.
Nagababu
అప్పటికి కొడుకు వరుణ్ తేజ్ (Varun Tej) హీరో కాలేదు. కుటుంబ అవసరాలకు, అప్పులు తీర్చడానికి జబర్దస్త్ ద్వారా వచ్చే ఆదాయమే ఆధారం. అనూహ్యంగా జబర్దస్త్ సూపర్ డూపర్ హిట్. జబర్దస్త్ పదుల మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. యాంకర్స్ గా ఎంపికైన రష్మీ గౌతమ్, అనసూయల ఫేట్ మార్చేసింది. అలాగే నాగబాబును ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించింది.
Nagababu - Niharika
2013 ఫిబ్రవరి 7న జబర్దస్త్ (Jabardasth) మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఆ రోజు మొదలైన ఈ నవ్వుల కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతుంది. కాగా 2019లో నాగబాబు జబర్దస్త్ పై వ్యతిరేక జెండా ఎగురవేశారు. జబర్దస్త్ మానేస్తున్నట్లు ప్రకటించంతో పాటు షో నిర్మాతలు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై ఆరోపణలు చేశారు.
<p>గతంలో `అదిరింది` పేరుతో జీ తెలుగులో ప్రసారం అయినా ఈ షోకి కొత్త లుక్ని తీసుకొచ్చారు. `బొమ్మ అదిరింది`గా టైటిల్ మార్చి, యాంకర్లని, జడ్జ్ లను మార్చి కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తుంది. నవదీప్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చారు. ఈ షో గత ఆదివారం ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్లో సుమ, అలీ సందడి చేసి షోకి ఊపు తీసుకొచ్చారు. </p>
కమెడియన్స్ శ్రమను దోచుకుంటున్నారు. వాళ్లకు సరైన ఫుడ్ కూడా పెట్టరు. వేతనాలు ఇవ్వరంటూ ఆక్రోషం వెళ్లగక్కారు. ఇక జబర్దస్త్ తనకు ఎంత మేలు చేసిందో... తన వలన షోకి కూడా మేలు జరిగిందని అన్నారు. వెళుతూ వెళుతూ జబర్దస్త్ ని కూలదోసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా జబర్దస్త్ డైరెక్టర్స్ తో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి కొందరు కమెడియన్స్ ని తనతోపాటు తీసుకుపోయాడు.
జబర్దస్త్ నుండి బయటికొచ్చిన వెంటనే జీతెలుగులో అదిరింది పేరుతో కామెడీ షో స్టార్ట్ చేశాడు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధన్ రాజ్, టిల్లుతో పాటు మరికొందరు కొత్త కమెడియన్స్ తో జబర్దస్త్ ని ఢీ కొట్టాలని చూశారు. మెల్లగా ఊపందుకుంటుందిలే అనుకుంటే ఏమాత్రం చలనం లేదు. ప్రైమ్ టైం లో ప్రసారం చేస్తున్నప్పటికీ అదిరింది షోకి ఆదరణ దక్కలేదు.
అదిరింది షోతో ఏదో చేసేద్దాం అనుకున్న నాగబాబుకు భారీ షాక్ తగిలింది. చేసేదేమీ లేక ఆ కామెడీ షోకి తెరదించారు. తర్వాత యూట్యూబ్ లో స్టాండప్ కామెడీ అంటూ కొన్ని ప్రయోగాలు చేశారు. ఏవీ సరైన ఫలితం ఇవ్వకపోవడంతో కొన్నాళ్ళు గమ్మునున్నాడు.
మరోవైపు రోజా నిష్క్రమణతో జబర్దస్త్ షో బలహీన పడినట్లే. టైమింగ్ పంచ్ లకు రోజా(Roja Selvamani) పెట్టింది పేరు. వేదికపై కమెడియన్స్ వేసే పంచ్ లకు ఆమె ఇచ్చే కౌంటర్లు భలే మజా పంచుతాయి. ఏళ్ల తరబడి అనుభవం నేపథ్యంలో షోని రక్తికట్టించగల నేర్పు ఆమెలో ఉంది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేశారు.
కాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకి కొద్దిరోజుల క్రితం నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. అవినాష్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనాధన్ ధన్ రాజ్ టీమ్ లీడర్స్ గా ఆయన షోని నడిపిస్తున్నారు. జబర్ధస్త్ కి పోటీగా ఓ షో చేసి తొక్కేయాలని చూస్తున్న నాగబాబుకు ఇదే సరైన సమయం. జబర్దస్త్ ని దెబ్బతీసి మేకర్స్ పై రివేంజ్ తీర్చుకోవడానికి సరైన సమయం అని చెప్పాలి.
అయితే రోజా వెళ్ళిపోయినా... జబర్దస్త్ ని మోసే రెండు బలమైన పిల్లర్స్ అక్కడ ఉన్నాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ ఉన్నంత వరకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎలాంటి ఢోకా లేదు. రోజా లేకపోవడం మైనస్ అయినప్పటికీ ఈ రెండు టీమ్స్ ఆడియన్స్ ని రప్పించగలవు. కానీ నాగబాబుకు అవకాశాలు మెరుగయ్యాయి.